Anti-Maoist Operation: భద్రతా బలగాల అదుపులో 10 మంది మావోయిస్టులు.. రిలీజ్ చేయాలని ప్రజా సంఘాల డిమాండ్..
- బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు..
- భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు..
- ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కీలక సభ్యుడు మృతి..
- భద్రతా బలగాల అదుపులో మరో 10 మంది మావోయిస్టులు ఉన్నారంటున్న ప్రజా సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti-Maoist Operation: దేశంలో పీడిత జనాల కోసం పోరాటం చేసిన పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. అది మామూలు కష్టం కూడా కాదు.. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి లేకుండా పోయింది. ఆపరేషన్ కాగారు పేరుతో కొనసాగుతున్న కూంబింగ్ లో మావోయిస్టు అగ్రనేతలను భద్రత బలగాలు హతమార్చుతున్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ నంబాల కేశవరావు ఎన్ కౌంటర్లో చనిపోయిన తర్వాత అంతే స్థాయిలో ఉన్న సుధాకర్ ని సైతం హతమార్చాయి. 16 నెలల్లో 11 మంది కేంద్ర కమిటీ సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. 44 మందితో ఉండాల్సిన కేంద్ర కమిటీ ఇప్పుడు కేవలం 11 మందికే పరిమితమైంది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే 9 మంది ఉన్నారు.
Read Also: Konda Vishweshwar Reddy: చేవెళ్లకు చుక్క నీరు రాదు.. మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
అయితే, ఆపరేషన్ కాగార్ పేరుతో కర్రె గుట్టలను చుట్టుముట్టి అక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టు పార్టీకి నష్ట్రాన్ని చేకూర్చింది భద్రతా బలగాలు. అది పూర్తైన తర్వాత అబుజుమడుని తమ హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు, ఇంద్రవతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే 3 రోజులుగా ఆపరేషన్ నేషనల్ పార్క్ పేరుతో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. 3 రోజుల్లో 7 మావోయిస్టులను చంపేశాయి భద్రతా సిబ్బంది. అందులో కేంద్ర కమిటీ సభ్యుల్లో కీలకమైన సుధాకర్ తో పాటు భాస్కర్ కూడా చనిపోయాడు. మావోయిస్టు పాఠశాలకు అధిపతిగా ఉంటూ వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో కీలక పాత్ర పోషించిన సుధాకర్ మరణించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో కీలక పాత్ర పోషించి చర్చల కోసం బయటికి వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన సుధాకర్ ను బలగాలు ఎన్ కౌంటర్ లో హతమార్చాయి.
Read Also: SVSN Varma : పవన్ కల్యాణ్ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..
కాగా, ఇప్పుడు మరొ 10 మంది కూడా భద్రతా బలగాల చేతుల్లో ఉన్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన వాళ్ళని వదిలి పెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బలగాల చెరలో ఉన్న 10 మందిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని కోరుతున్నాయి. అది సాధ్యం కాకపోతే తాము సుప్రీంకోర్టులో హైబీఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని పేర్కొన్నాయి. ఛత్తీస్ గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్ట్ నాయకులు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు, రామన్న డీసీ మెంబర్, మున్నా, సునీత, మహేష్ లకు పోలీసులు ప్రాణ హాని తలపెట్టకుండా వెంటనే న్యాయస్థానం ముందు హాజరు పర్చాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది.
Read Also: Kingdom: అనుకున్నంతా అయ్యింది!
ఇక, ప్రాణాలతో దొరికిన మావోయిస్టు నాయకులను ఎన్ కౌంటర్ పేరుతో హతమార్చడం రాజ్యాంగ విరుద్ధం అని పౌర హక్కుల సంఘం నేతలు పేర్కొంటున్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు సుధాకర్, భాస్కర్లను మాత్రమే గుర్తించాం.. ఇంకా ఐదుగురిని గుర్తించ వలసి ఉందని పేర్కొంది.. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలను గుర్తించ వలసి ఉందని భద్రతా బలగాలు ప్రకటించాయి.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!