Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. ఉద్రిక్తతల సమయంలో సైన్యాన్ని, ఆయుధ వ్యవస్థలను వేగంగా తరలించేందుకు రోడ్లను నిర్మిస్తోంది.
జాతీయ రహదారి-15, అరుణాచల్ ప్రదేశ్ లో ఫ్రాంటియర్ హైవేలకు కేంద్ర పచ్చ జెండా ఊపింది. చైనాకు సరిహద్దులో ఉన్న భారత ప్రాంతాలను కలిపేందుకు, రహదారి కనెక్టవిటీని మెరుగుపరిచేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 2,178 కిలోమీటర్ల పొడవైన ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రోడ్ల ద్వారా సైనిక సామాగ్రిని వేగంగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఏర్పడుతుంది.
Also Read
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
Read Also: Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
సరిహద్దుల వరక మూడు కీలక రహదారులను విస్తరించనున్నారు. ఇటాఖోలా-సీజోసా-పక్కే కెస్సాండ్- సెప్పా చయాంగ్తాజో- సాంగ్గ్రామ్-పార్సీ పార్లో వరకు 391 కిలోమీటర్లు, కనుబారి -లాంగ్డింగ్ వరకు 404 కిలోమీటర్లు, అకాజాన్-పాంగో జార్జింగ్ మధ్య 398 కిలోమీటర్లు, గోగముఖ్ తహిలా టాటో వరకు 285 కిలోమీటర్ల దూరం, తెలమార- తవాంగ్- నీలియా (సరిహద్దు) వరకు 402 కిలోమీటర్లు, పాసిఘాట్ బిషింగ్ (సరిహద్దు) వరకు 298 కిలోమీటర్లు ఇలా ఆరు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అని చాలా రోజులుగా చైనా వాదిస్తోంది. దీంతో ఈ ప్రాంతంపై చైనా బలగాల కన్ను ఉంది. దీంతో ఈ రాష్ట్ర సరిహద్దుల్లో చైనా గ్రామాలను కూడా నిర్మిస్తోంది. దీంతో భారత్ ప్రభుత్వం కూడా చైనా దుందుడుకు చర్యలకు చెక్ పెట్టే విధంగా సైనిక మౌళిక సదుపాయాలను పెంచుకుంటోంది. అయితే భారత్ లఢఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోచేపడుతున్న నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇవి ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయంటూ గగ్గోలు పెడుతోంది. అయితే తను మాత్రం ఎంచక్కా నిర్మాణాలు చేపడుతూ పోతోంది.
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!