Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. ఉద్రిక్తతల సమయంలో సైన్యాన్ని, ఆయుధ వ్యవస్థలను వేగంగా తరలించేందుకు రోడ్లను నిర్మిస్తోంది.
జాతీయ రహదారి-15, అరుణాచల్ ప్రదేశ్ లో ఫ్రాంటియర్ హైవేలకు కేంద్ర పచ్చ జెండా ఊపింది. చైనాకు సరిహద్దులో ఉన్న భారత ప్రాంతాలను కలిపేందుకు, రహదారి కనెక్టవిటీని మెరుగుపరిచేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూ. 2,178 కిలోమీటర్ల పొడవైన ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ రోడ్ల ద్వారా సైనిక సామాగ్రిని వేగంగా చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఏర్పడుతుంది.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also: Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
సరిహద్దుల వరక మూడు కీలక రహదారులను విస్తరించనున్నారు. ఇటాఖోలా-సీజోసా-పక్కే కెస్సాండ్- సెప్పా చయాంగ్తాజో- సాంగ్గ్రామ్-పార్సీ పార్లో వరకు 391 కిలోమీటర్లు, కనుబారి -లాంగ్డింగ్ వరకు 404 కిలోమీటర్లు, అకాజాన్-పాంగో జార్జింగ్ మధ్య 398 కిలోమీటర్లు, గోగముఖ్ తహిలా టాటో వరకు 285 కిలోమీటర్ల దూరం, తెలమార- తవాంగ్- నీలియా (సరిహద్దు) వరకు 402 కిలోమీటర్లు, పాసిఘాట్ బిషింగ్ (సరిహద్దు) వరకు 298 కిలోమీటర్లు ఇలా ఆరు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం చైనాలో భాగం అని చాలా రోజులుగా చైనా వాదిస్తోంది. దీంతో ఈ ప్రాంతంపై చైనా బలగాల కన్ను ఉంది. దీంతో ఈ రాష్ట్ర సరిహద్దుల్లో చైనా గ్రామాలను కూడా నిర్మిస్తోంది. దీంతో భారత్ ప్రభుత్వం కూడా చైనా దుందుడుకు చర్యలకు చెక్ పెట్టే విధంగా సైనిక మౌళిక సదుపాయాలను పెంచుకుంటోంది. అయితే భారత్ లఢఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోచేపడుతున్న నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇవి ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉన్నాయంటూ గగ్గోలు పెడుతోంది. అయితే తను మాత్రం ఎంచక్కా నిర్మాణాలు చేపడుతూ పోతోంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!