Former CM Atishi: ఢిల్లీలో విద్యుత్ కోతలు పెరిగాయి.. బీజేపీపై మాజీ సీఎం ఫైర్
- ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయి..
- ఢిల్లీలో చాలా సేపు కరెంట్ పోతుందని ఆరోపించిన మాజీ సీఎం అతిషి..
- బీజేపీ ప్రభుత్వం విద్యుత్ కోతలను తగ్గించాలని అతిషి మార్లెనా డిమాండ్
Former CM Atishi: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలం సర్కార్ వచ్చిన వెంటనే హస్తినాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లను మరచిపోయారని పేర్కొన్నారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో చాలా సేపు కరెంట్ కోతలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి.. దీని వల్ల విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించడం లేదని అతిషి ఎద్దేవా చేసింది.
Read Also: Mullapudi Brahmanandam: సినీ పరిశ్రమలో విషాదం.. నిర్మాత మృతి!
Also Read
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
అయితే, గత సంవత్సరం ఈ రికార్డు 8,656 మెగావాట్లకు చేరుకోగా.. ఈసారి దీని డిమాండ్ తొమ్మిది వేల మెగావాట్లకు మించి చేరుకుంటుందని మాజీ సీఎం అతిషి తెలిపింది. మార్చి నుంచి వేసవికాలం ముగిసే వారకు విద్యుత్ కి డిమాండ్ ఉంటుంది.. గరిష్టంగా 4,361 మెగావాట్లకు చేరుకుంది.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లను ప్రజలు బాగా ఉపయోగిస్తున్నారు.. దీంతో కరెంట్ ఉత్పత్తి పెరిగిందన్నారు.
Read Also: Subham Teaser: శోభనం గదిలో ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్గా సమంత ‘శుభం’ మూవీ టీజర్!
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ఇంధన శాఖ మంత్రి ఆశిష్ సూద్ ఖండించారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.. వేసవి కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. కరెంట్ కోతలు లేకుండా పని చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ కంపెనీలు కూడా తగినంత విద్యుత్ లభ్యతను నిర్ధారించుకున్నాయి.. విద్యుత్ నెట్వర్క్ కూడా మరమ్మతు చేయబడిందని మంత్రి ఆశిష్ సూద్ చెప్పుకొచ్చారు. కాగా, 2022వ ఏడాది మార్చిలో 4,648 మెగావాట్లుగా నమోదైంది. ఇక, గత ఏడాది మార్చి 31న గరిష్ట డిమాండ్ 4,482 మెగావాట్లతో పోలిస్తే, ఈసారి డిమాండ్లో కొంత తగ్గుదల కనిపిస్తుందని విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. కానీ, ఏప్రిల్లో డిమాండ్ ఐదు వేల మెగావాట్లకు మించి చేరే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో