Former CM Atishi: ఢిల్లీలో విద్యుత్ కోతలు పెరిగాయి.. బీజేపీపై మాజీ సీఎం ఫైర్
- ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయి..
- ఢిల్లీలో చాలా సేపు కరెంట్ పోతుందని ఆరోపించిన మాజీ సీఎం అతిషి..
- బీజేపీ ప్రభుత్వం విద్యుత్ కోతలను తగ్గించాలని అతిషి మార్లెనా డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former CM Atishi: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలం సర్కార్ వచ్చిన వెంటనే హస్తినాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీ ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లను మరచిపోయారని పేర్కొన్నారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీలో చాలా సేపు కరెంట్ కోతలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి.. దీని వల్ల విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించడం లేదని అతిషి ఎద్దేవా చేసింది.
Read Also: Mullapudi Brahmanandam: సినీ పరిశ్రమలో విషాదం.. నిర్మాత మృతి!
Also Read
అయితే, గత సంవత్సరం ఈ రికార్డు 8,656 మెగావాట్లకు చేరుకోగా.. ఈసారి దీని డిమాండ్ తొమ్మిది వేల మెగావాట్లకు మించి చేరుకుంటుందని మాజీ సీఎం అతిషి తెలిపింది. మార్చి నుంచి వేసవికాలం ముగిసే వారకు విద్యుత్ కి డిమాండ్ ఉంటుంది.. గరిష్టంగా 4,361 మెగావాట్లకు చేరుకుంది.. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లను ప్రజలు బాగా ఉపయోగిస్తున్నారు.. దీంతో కరెంట్ ఉత్పత్తి పెరిగిందన్నారు.
Read Also: Subham Teaser: శోభనం గదిలో ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్గా సమంత ‘శుభం’ మూవీ టీజర్!
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ఇంధన శాఖ మంత్రి ఆశిష్ సూద్ ఖండించారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.. వేసవి కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. కరెంట్ కోతలు లేకుండా పని చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ కంపెనీలు కూడా తగినంత విద్యుత్ లభ్యతను నిర్ధారించుకున్నాయి.. విద్యుత్ నెట్వర్క్ కూడా మరమ్మతు చేయబడిందని మంత్రి ఆశిష్ సూద్ చెప్పుకొచ్చారు. కాగా, 2022వ ఏడాది మార్చిలో 4,648 మెగావాట్లుగా నమోదైంది. ఇక, గత ఏడాది మార్చి 31న గరిష్ట డిమాండ్ 4,482 మెగావాట్లతో పోలిస్తే, ఈసారి డిమాండ్లో కొంత తగ్గుదల కనిపిస్తుందని విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. కానీ, ఏప్రిల్లో డిమాండ్ ఐదు వేల మెగావాట్లకు మించి చేరే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!