Karnataka Election Results: బీజేపీని దెబ్బకొట్టిన లింగాయత్లు.. చివరి నిమిషంలో కమలం పాచిక పారలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 136 స్థానాల్లో గెలుపును దాదాపుగా ఖారారు చేసుకుంది. బీజేపీ 64 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక కింగ్ మేకర్ అవుదాం అనుకున్న జేడీఎస్ మాత్రం దారుణంగా విఫలం అయింది. కేవలం ఆ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ప్రభావితం చూపించింది.
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
- Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
Read Also: BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై
ఇదిలా ఉంటే కర్ణాటక జనాభాలో లింగాయత్, వొక్కలిగ వర్గాలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా బీజేపీకి మొదటి నుంచి లింగాయత్ వర్గం వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వొక్కలిగలు జేడీయూకు అండగా ఉంటున్నా.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కన్నడ ప్రజల్లో 17 శాతం ఉన్న లింగాయత్ లు 78 స్థానాల్లో ప్రభావం చూపిస్తారు. అయతే ఈ సారి ఈ స్థానాల్లో 54 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 19 స్థానాలకే పరిమితం అయింది. లింగాయత్ ఆధిపత్య స్థానాలపై బీజేపీ స్కోరు 28కి పడిపోయిందని, కాంగ్రెస్ 29 లాభపడ్డాయని కూడా ట్రెండ్స్ చూపిస్తున్నాయి.
లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్పను బలవంతంగా సీఎం కుర్చీ నుంచి దించడం, జగదీష్ పెట్టర్ వంటి బీజేపీ నేతను పార్టీ నుంచి బయటకు పంపేలా చేయడం బీజేపీని దెబ్బతీసింది. సీఎం బొమ్మై ఆ వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి నెలలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ రద్దు చేసి, లింగాయత్ లకు 2, వొక్కలిగలకు 2 శాతం కేటాయిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టులో ఉంది. ఈ పాచిక కూడా బీజేపీ విజయానికి దోహదపడలేదు.
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!