Karnataka Election Results: బీజేపీని దెబ్బకొట్టిన లింగాయత్లు.. చివరి నిమిషంలో కమలం పాచిక పారలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 136 స్థానాల్లో గెలుపును దాదాపుగా ఖారారు చేసుకుంది. బీజేపీ 64 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఇక కింగ్ మేకర్ అవుదాం అనుకున్న జేడీఎస్ మాత్రం దారుణంగా విఫలం అయింది. కేవలం ఆ పార్టీ 20 స్థానాల్లో మాత్రమే ప్రభావితం చూపించింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై
ఇదిలా ఉంటే కర్ణాటక జనాభాలో లింగాయత్, వొక్కలిగ వర్గాలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా బీజేపీకి మొదటి నుంచి లింగాయత్ వర్గం వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వొక్కలిగలు జేడీయూకు అండగా ఉంటున్నా.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కన్నడ ప్రజల్లో 17 శాతం ఉన్న లింగాయత్ లు 78 స్థానాల్లో ప్రభావం చూపిస్తారు. అయతే ఈ సారి ఈ స్థానాల్లో 54 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 19 స్థానాలకే పరిమితం అయింది. లింగాయత్ ఆధిపత్య స్థానాలపై బీజేపీ స్కోరు 28కి పడిపోయిందని, కాంగ్రెస్ 29 లాభపడ్డాయని కూడా ట్రెండ్స్ చూపిస్తున్నాయి.
లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్పను బలవంతంగా సీఎం కుర్చీ నుంచి దించడం, జగదీష్ పెట్టర్ వంటి బీజేపీ నేతను పార్టీ నుంచి బయటకు పంపేలా చేయడం బీజేపీని దెబ్బతీసింది. సీఎం బొమ్మై ఆ వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి నెలలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ రద్దు చేసి, లింగాయత్ లకు 2, వొక్కలిగలకు 2 శాతం కేటాయిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టులో ఉంది. ఈ పాచిక కూడా బీజేపీ విజయానికి దోహదపడలేదు.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!