Karnataka: 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్కౌంటర్..
- 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య..
- నిందితుడిని ఎన్కౌంటర్లో హతమార్చిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన నితేష్ కుమార్గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో ప్రతిఘటించడంతో పోలీసులు కాల్చి చంపాల్సి వచ్చింది. నిందితుడు బాలికను ఒక షెడ్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే, బాలిక అరుపులు విన్న స్థానికులు షెడ్ వైపు వెళ్లారు. ఆ సమయంలో బాలిక గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీలో రికార్డైంది.
35 ఏళ్ల నిందితుడు నితేష్ కుమార్, పోలీసులపై దాడి చేశాడు, హెచ్చరిక కాల్పులు జరిపినప్పటికీ పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసుతో పాటు హత్య, అత్యాచారం కేసు నమోదైంది. నితేష్ స్వస్థలం బీహార్లోని పాట్నా. నిందితుడి గుర్తింపుని నిర్ధారించడానికి అతడి స్వస్థలం తీసుకెళ్తుండగా పోలీసులపై దాడి చేసినట్లు హుబ్బళ్లి పోలీస్ చీఫ్ శశికుమార్ మీడియాకు తెలిపారు.
Also Read
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
Read Also: Nithin : నితిన్ కు రూ.75 లక్షలు ఇస్తే హ్యాండ్ ఇచ్చాడు.. నిర్మాత సంచలనం..
సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ నిందితుడి పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రక్రియలో ఒక పోలీస్ వాహనం కూడా ధ్వంసమైందని, కాల్పుల అనంతరం అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు శశికుమార్ చెప్పారు.
నితేష్ కుమార్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేసి హత్య చేసిన సంఘటన హుబ్బళ్లిలో ఉద్రిక్తతకు కారణమైంది. న్యాయం కోసం పెద్ద ఎత్తున నివాసితులు ఆందోళన చేశారు. బాధిత బాలిక కుటుంబ కొప్పల్ జిల్లాకు చెందినది. ఆమె తల్లి ఇళ్లలో పనిచేస్తూ, బ్యూటీపార్లర్లో సహాయకురాలిగా పనిచేస్తుండగా, తండ్రి పెయింటర్గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి స్థానిక ఇళ్లలో పనిచేస్తున్న క్రమంలో తన కూతురిని కూడా తీసుకెళ్లింది. అక్కడే బాలికను నిందితుడు కిడ్నాప్ చేశాడు. బాలిక కోసం వెతకగా ఒక షెడ్లోని బాత్రూంలో శవంగా కనిపించింది.
తాజావార్తలు
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!