Karnataka: 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య.. నిందితుడి ఎన్కౌంటర్..
- 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం, హత్య..
- నిందితుడిని ఎన్కౌంటర్లో హతమార్చిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి, బాలిక గొంతు నులిమి హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. నిందితుడిని బీహార్ రాష్ట్రానికి చెందిన నితేష్ కుమార్గా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నిందితుడిని అరెస్ట్ చేసే క్రమంలో ప్రతిఘటించడంతో పోలీసులు కాల్చి చంపాల్సి వచ్చింది. నిందితుడు బాలికను ఒక షెడ్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. అయితే, బాలిక అరుపులు విన్న స్థానికులు షెడ్ వైపు వెళ్లారు. ఆ సమయంలో బాలిక గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఎత్తుకెళ్లినట్లుగా సీసీటీవీలో రికార్డైంది.
35 ఏళ్ల నిందితుడు నితేష్ కుమార్, పోలీసులపై దాడి చేశాడు, హెచ్చరిక కాల్పులు జరిపినప్పటికీ పారిపోవడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసుతో పాటు హత్య, అత్యాచారం కేసు నమోదైంది. నితేష్ స్వస్థలం బీహార్లోని పాట్నా. నిందితుడి గుర్తింపుని నిర్ధారించడానికి అతడి స్వస్థలం తీసుకెళ్తుండగా పోలీసులపై దాడి చేసినట్లు హుబ్బళ్లి పోలీస్ చీఫ్ శశికుమార్ మీడియాకు తెలిపారు.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Read Also: Nithin : నితిన్ కు రూ.75 లక్షలు ఇస్తే హ్యాండ్ ఇచ్చాడు.. నిర్మాత సంచలనం..
సబ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ నిందితుడి పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రక్రియలో ఒక పోలీస్ వాహనం కూడా ధ్వంసమైందని, కాల్పుల అనంతరం అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు శశికుమార్ చెప్పారు.
నితేష్ కుమార్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు గురిచేసి హత్య చేసిన సంఘటన హుబ్బళ్లిలో ఉద్రిక్తతకు కారణమైంది. న్యాయం కోసం పెద్ద ఎత్తున నివాసితులు ఆందోళన చేశారు. బాధిత బాలిక కుటుంబ కొప్పల్ జిల్లాకు చెందినది. ఆమె తల్లి ఇళ్లలో పనిచేస్తూ, బ్యూటీపార్లర్లో సహాయకురాలిగా పనిచేస్తుండగా, తండ్రి పెయింటర్గా పనిచేస్తున్నాడు. బాలిక తల్లి స్థానిక ఇళ్లలో పనిచేస్తున్న క్రమంలో తన కూతురిని కూడా తీసుకెళ్లింది. అక్కడే బాలికను నిందితుడు కిడ్నాప్ చేశాడు. బాలిక కోసం వెతకగా ఒక షెడ్లోని బాత్రూంలో శవంగా కనిపించింది.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!