The Kerala Story: కూతుళ్లతో కలిసి “కేరళ స్టోరీ” చూడండి.. తల్లిదండ్రులకు సీఎం పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదిలా ఉంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. పలువురు సీఎంలు, మంత్రులు ఈ సినిమాను చూస్తున్నారు.
తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురువారం తన క్యాబినెట్ మంత్రుల, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సినిమాను చూశారు. చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి కుమార్తెలతో సినిమాను చూడాలని కోరారు. ‘ది కేరళ స్టోరీ’ తీవ్రవాదం గురించి, జీహాద్, మతం పేరుతో ఉగ్రవాద శిబిరాల్లో ఏం జరుగుతుందో వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. అమాయక మహిళలను తీవ్రవాద గ్రూపులు పావుగా ఉపయోగించుకున్న విధానాన్ని సినిమాలో చూపించారని అన్నారు. అమాకమైన కేరళ ప్రజల్లో కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని, కేరళీయుల వారి గళాన్ని వినిపించాలని ఆయన అన్నారు.
Also Read
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
Read Also: Imran Khan: ఇమ్రాన్ అరెస్ట్ అక్రమం.. వెంటనే విడుదల చేయండి.. పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
అస్సాం రాష్ట్రంలో అమ్మాయిలు ఉగ్రవాదంలో చేరిన కేసులు లేవని, అయితే ప్రేమ పేరుతో మతం మార్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ధర్మాన్ని రక్షించండి, నాగరికతను రక్షించడం, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు. ‘ ది కేరళ స్టోరీ’ సినిమాను ఆడపిల్లలతో కలిసి భారత దేశ ప్రజలు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) గురించి చెబుతుందని, ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు.
ఓ వైపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ, హిందూ సంఘాలు మాత్రం ప్రశంసిస్తున్నాయి. కేరళలో మతమార్పిడులు, ఉగ్రవాదంలో చేరిన అమ్మాయిల ఇతివృత్తం ఆధారంగా సినిమాను రూపొందించారు. 35,000 అమ్మాయిలను మతం మార్చారని ట్రైలర్ లో చెప్పడం వివాదాస్పదం అయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏకంగా ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీల అబద్ధపు ప్రచారమని విమర్శించారు.
తాజావార్తలు
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
-
Ravi Shastri: “చాలా పెద్ద తప్పు చేస్తున్నారు”.. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!