The Kerala Story: కూతుళ్లతో కలిసి “కేరళ స్టోరీ” చూడండి.. తల్లిదండ్రులకు సీఎం పిలుపు
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదిలా ఉంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. పలువురు సీఎంలు, మంత్రులు ఈ సినిమాను చూస్తున్నారు.
తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురువారం తన క్యాబినెట్ మంత్రుల, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సినిమాను చూశారు. చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి కుమార్తెలతో సినిమాను చూడాలని కోరారు. ‘ది కేరళ స్టోరీ’ తీవ్రవాదం గురించి, జీహాద్, మతం పేరుతో ఉగ్రవాద శిబిరాల్లో ఏం జరుగుతుందో వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. అమాయక మహిళలను తీవ్రవాద గ్రూపులు పావుగా ఉపయోగించుకున్న విధానాన్ని సినిమాలో చూపించారని అన్నారు. అమాకమైన కేరళ ప్రజల్లో కొంతమంది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారని, కేరళీయుల వారి గళాన్ని వినిపించాలని ఆయన అన్నారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Imran Khan: ఇమ్రాన్ అరెస్ట్ అక్రమం.. వెంటనే విడుదల చేయండి.. పాక్ సుప్రీంకోర్టు ఆదేశం
అస్సాం రాష్ట్రంలో అమ్మాయిలు ఉగ్రవాదంలో చేరిన కేసులు లేవని, అయితే ప్రేమ పేరుతో మతం మార్చిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ధర్మాన్ని రక్షించండి, నాగరికతను రక్షించడం, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు. ‘ ది కేరళ స్టోరీ’ సినిమాను ఆడపిల్లలతో కలిసి భారత దేశ ప్రజలు చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) గురించి చెబుతుందని, ముస్లింలకు వ్యతిరేకం కాదని అన్నారు.
ఓ వైపు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తుండగా.. బీజేపీ, హిందూ సంఘాలు మాత్రం ప్రశంసిస్తున్నాయి. కేరళలో మతమార్పిడులు, ఉగ్రవాదంలో చేరిన అమ్మాయిల ఇతివృత్తం ఆధారంగా సినిమాను రూపొందించారు. 35,000 అమ్మాయిలను మతం మార్చారని ట్రైలర్ లో చెప్పడం వివాదాస్పదం అయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏకంగా ఈ సినిమాను ఆర్ఎస్ఎస్, బీజేపీల అబద్ధపు ప్రచారమని విమర్శించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!