Success Story: కష్టపడే తత్వం, తెలివితేటలు ఉంటే చాలా ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొని గొప్పగా మారొచ్చు. అందుకు ఈ దిల్ఖుష్కుమార్ జీవితమే ఓ ఉదాహరణ. పెద్దపెద్ద చదువులు చదివినా కొన్ని సార్లు రాని పేరు తన కష్టం, తెలివితో సాధించుకున్నాడు. రిక్షాపుల్లర్, సాధారణ డ్రైవర్, కూరగాయల వ్యాపారి స్థాయి నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దేశంలో పేరొందిన ఐఐటీ, ఐఐఎం గ్యాడ్యుయేట్లకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
PM Modi: భగవాన్ హనుమాన్ స్పూర్తితో దేశంలోని అవినీతి, బంధు ప్రీతి, వారసత్వ రాజకీయాలు, శాంతిభద్రతల సవాళ్లపై పోరాడలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ హనుమంతుడిలా దేశం కోసం ధృడసంకల్పం, దేశ సంక్షేమం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని, పార్టీ కార్యకర్తలు త్యాగం, అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
Hindu temple vandalised: కెనడాలో మరోసారి హిందూ ఆలయంపై దుండగులు దాడి చేశారు. భారత వ్యతిరేక రాతలతో గుడిని ధ్వంసం చేశారు. నాలుగు నెలల్లో రెండోసారి ఇలాంటి ఘటన జరిగింది. ఒంటారియోలో బుధవారం ఈ ఘటన జరిగింది. జనవరి 31న ఇలాగే బ్రాంప్టన్ లో హిందూ దేవాలయంపై దాడి చేశారు. తాజాగా జరిగిన దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులు దేవాలయంపై పెయింటిగ్ స్ప్రే చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనను ద్వేషపూరిత ఘటనగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు విండ్సర్ పోలీసులు వెల్లడించారు.
Annamalai: కర్ణాటకలో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. అధికారంలోకి రావడానికి బీజేపీ, కాంగ్రెస్ కష్టపడుతున్నాయి. ఇదిలా ఉంటే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దుతు తెలపడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. దీంతో బీజేపీపై, సుదీప్ పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ రాహుల్ గాంధీకి మద్దతుపలకాన్ని ఆయన ప్రస్తావిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీపై విమర్శలుకు దిగారు.
Prakash Raj: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తాను బీజేపీ తరుపున పోటీ చేయడం లేదని చెబుతూనే.. తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈయనతో పాటు మరో స్టార్ హీరో దర్శన్ కూడా బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది.
Sexual assault on girl: దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మాణంలో ఉన్న భవనంలో దొంగతనం చేయాలని ప్రవేశించిన బాలుడు అక్కడే పనిచేస్తున్న 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో మంగళవారం ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది.
Hanuman Jayanti: హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. గతేడాది అల్లర్లను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్పురిలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధం అయ్యారు.
Indira Gandhi International Airport: ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో ఘనత సాధించింది. ఇప్పటిదే దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ ఎయిర్ పోర్టు.. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) జాబితా ప్రకారం 5.94 కోట్లకు పైగా ప్రయాణికుల రద్దీతో ఢిల్లీ విమానాశ్రయం 2022లో ప్రపంచంలోనే తొమ్మిదవ రద్దీగా ఉండే విమానాశ్రయంగా అవతరించింది.
Odisha: ఒడిశాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ హెడ్ మాస్టర్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. 2015లో 11 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సదరు హెడ్ మాస్టర్. ఆయనకు సుందర్గఢ్ జిల్లాలోని పోక్సో కోర్టు బుధవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 62 ఏళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా లెఫ్రిపారా బ్లాక్ లోని ఓ పాఠశాలలో పనిచేసేవారు. ఆ సమయంలో స్కూల్ లోని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.