Punjab High Alert: పంజాబ్ పోలీసులు రాడికల్ ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు, సెంట్రల్ టీమ్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులపై అమృత్ పాల్ సింగ్ ఎఫెక్ట్ పడింది. ఏప్రిల్ 14 వరకు పోలీసులందరికీ సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
James Webb telescope clicks Uranus: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విశ్వంలోని అనేక అద్భుతాలను మనముందు ఉంచుతోంది. హబుల్ టెలిస్కోప్ తో పోలిస్తే చాలా శక్తివంతమైన టెలిస్కోప్ అయిన జేమ్స్ వెబ్ విశ్వ మూలాల్లోని ఖగోళ అద్భుతాలను శాస్త్రవేత్తలకు అందిస్తోంది. విశ్వం పుట్టుక, అత్యంత పురాతన గెలాక్సీలు, నక్షత్రాల పుట్టుక, బ్లాక్ హోల్స్, పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ వంటి వాటిని భూమికి పంపించింది. విశ్వ రహస్యాలను చేధించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
alman Khan bullet proof Car: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు గత కొన్ని రోజులుగా హత్యా బెదిరింపులు ఎదురవుతున్నాయి. గ్యాంగ్ స్టర్లు ఆయన్ను చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈమెయిల్స్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనకు ముంబై పోలీసులు మరింత భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే ఇలాంటి బెదిరింపుల మధ్య తన భద్రత కోసం హై ఎండ్ బుల్లెట్ ఫ్రూవ్ ఎస్యూవీ కారును కొనుగోలు చేశారు.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాని నరేంద్రమోదీకి జైలు నుంచే లేఖ రాశారు. సీఎం కేజ్రీవాల్ లాగా సిసోడియా కూడా ప్రధాని విద్యార్హతపై ప్రశ్నలు లేవనెత్తారు. మనీస్ సిసోడియా రాసిన లేఖను సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ లేకలో సిసోడియా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. భారత దేశానికి విద్యావంతుడైన ప్రధాని కావాలని అన్నారు.
Kerala train attack: కేరళలో నడుస్తున్న రైలులో అగ్నిప్రమాదం, ముగ్గురు మరణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో నిందితుడు షారూఖ్ సైఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. షారూఖ్ సైఫీ జరిపింది ఉగ్రదాడి అని యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) నిర్ధారించింది. అతడిపై యూఏపీఏ(ఉపా చట్టం)ప్రయోగిస్తామని కేరళ డీజీపీ అనిల్ కాంత్ వెల్లడించారు.
Pink Moon: ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని ‘‘పింక్ మూన్’’గా పిలుస్తున్నారు. అయితే చంద్రుడు పింక్ కలర్ లో కనిపించకున్నా ఎందుకు ఈ పేరుతో పిలుస్తున్నారో తెలుసా..? అయితే దీని వెనక ఓ స్టోరీ ఉంది. పింక్ మూన్ విషయానికి వస్తే గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు పింక్ మూన్ దర్శనం ఇస్తుంది.
Corona Cases: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే మళ్లీ ఇప్పుడే గరిష్టంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,050 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోలిస్తే 13 శాతం ఎక్కువగా కేసులు వచ్చాయి.
Extramarital affair: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు క్షణకాలం శారీరక సుఖం కోసం భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అతని మృతదేహాన్ని దొరకకుండా భారీ స్కెచ్ వేసింది. ఇలాంటి నేరాలు ఎంత దాచాలనుకున్నా పోలీసులకు ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంటాయి. ఈ కేసులో కూడా నిందితులు పోలీసులకు చిక్కారు.
Covid 19: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేవలం వెయ్యిలోపే ఉండే రోజూవారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 5 వేలను దాటింది. గురువారం ఏకంగా కేసుల సంఖ్య 5,000లను దాటిపోయింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల. అయితే ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB1.16 కారణం అవుతోంది.