Venu Goapl Reddy
Author- NTV Telugu-
Armenia: ఆర్మేనియా గ్యాస్ స్టేషన్లో పేలుడు.. 20 మంది మృతి, 300 మందికి గాయాలు…
Armenia: ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రికత్త నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నగర్నో-కారాబఖ్ ప్రాంతం విదాస్పదంగా మారింది. ఈ ప్రాంతంలోని ఆర్మేనియన్లపై అజర్ బైజాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తరలివెళ్తున్న ఆర్మేనియన్లు భారీ ప్రమాదం బారిన పడ్డారు. గ్యాస్ స్టేషన్ వద్ద భారీ ప్రమాదం సంభవించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయపడ్డారు. -
Hardeep Singh Nijjar: నిజ్జర్పై 50 రౌండ్ల బుల్లెట్స్ ఫైరింగ్.. వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్..
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ హత్యకు భారత ఏజెంట్లే కారణమని అమెరికా నిందిస్తుంది. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి తాజగా ఓ సీసీటీవీ వీడియో బయటపడింది. జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. -
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాదం కోసం పంజాబ్ యువతకు వల..
India-Canada: ఇండియా-కెనడాల మధ్య దౌత్యవివాదం తీవ్రస్థాయికి చేరింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇదే దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు పంజాబ్ నుంచి ఉపాధి కోసం కెనడా వెళ్లే యువతను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్, మొనీందర్ సింగ్ బుల్, భగత్ సింగ్ బ్రార్ వంటి ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్ నుంచి వచ్చే వారిని ఇండియా వ్యతిరేకతకు పావులుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. -
Pakistan: హిందువులందరూ ఇస్లాంలోకి మారుతారని ఎదురుచూస్తున్నా.. పాక్ ప్రధాని పాత ట్వీట్ వైరల్..
Pakistan: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరు ఉల్ హక్ కాకర్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు తీవ్ర వివక్ష, వేధింపులను ఎదుర్కొంటున్నారు. అక్కడ నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోంది. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్లో రాజకీయ నాయకులు కూడా హిందువులను తుడిచివేయాలని చూస్తున్నారు. -
NASA: 7 ఏళ్ల తర్వాత గ్రహశకల నమూనాతో భూమిని చేరిన నాసా క్యాప్సూల్..
NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది. -
Manipur: మణిపూర్, మయన్మార్ల మధ్య 70 కి.మీ కంచె.. అర్జెంట్గా అవసరమన్న సీఎం
Manipur: గత మూడు నెలలుగా మణిపూర్ లో అల్లర్లు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఈ అల్లర్లకు పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చే కొన్ని శక్తులు కూడా కారణమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా మణిపూర్ లోకి మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందినవారు వచ్చి అక్కడి జనాభా -
Bridge collapse: గుజరాత్లో కూలిన వంతెన.. 10 మంది గల్లంతు..
Bridge collapse:గుజరాత్ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. వస్తాడి ప్రాంతంలో ఆదివారం పాత వంతెన కూలిపోయింది. దీంతో డంపర్, మోటార్ సైకిళ్లతో సహా పలు వాహనాలు వంతెన కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. వాహనాలతో పాటు ప్రయాణికులు నదిలో పడిపోయారు. -
Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..
Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
India-Canada: “కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి”.. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఇదే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణలు అసంబద్ధమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఇండియా ధ్వజమెత్తింది. -
Chandra Arya: హిందూ కెనడియన్లు భయపడుతున్నారు, దాని 3 కారణాలు ఉన్నాయి.. ట్రూడో పార్టీ ఎంపీ..
Chandra Arya: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ హత్య నేపథ్యంలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కెనడాలోని హిందువులను టార్గెట్ చేస్తూ, కెనడా వదిలిపెట్టి భారత్ వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కెనడాలో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీలో ఎంపీగా ఉన్న చంద్ర ఆర్య తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఖలిస్తానీ ఉగ్రమూకాల హెచ్చరికలతో హిందూ కెనడియన్లు భయపడుతున్నారని…
తాజావార్తలు
-
Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
-
TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!