Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జున్మోని శరీరం వెనకభాగంలో గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికి వెల్లడించింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక పలు అనుమానాలకు కారణం అవుతోంది.
పోస్టుమార్టం నివేదికతో అనుమానాలు:
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇదే కాకుండా ఆమె పక్కటెముకలు రెండు వైపు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట కారణంగా జున్మోని రభా మరణించిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆమె రెండు మోకాళ్లు, మోచేతులు, చేతులపై గాయాల కనిపించినట్లు తేలింది. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రణబ్ దాస్ ను నిన్న సాయంత్రం గౌహతి నుంచి నాగోన్ పోలీస్ స్టేషన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. తాను గౌహతి నుంచి వస్తున్న సమయంలో జున్మోని ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు ఎడమవైపున ఆపి ఉందని, అకాస్మత్తుగా ఓ లారీ వచ్చి కారును ఢీకొట్టిందని, ప్రమాదానికి ముందు ఓ నల్ల రంగు జీన్స్ ధరించిన వ్యక్తి కారు నుంచి దిగడం తాను చూశానని ప్రణబ్ దాస్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తాను కాసేపు ఉన్నానని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని జఖలాబాధ పోలీసులు ఆదేశించారని వెల్లడించారు.
Read Also: Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్పందించిన సీఎం..
ఈ కేసుపై సీఎం హిమంత బిశ్వసర్మ స్పందించారు. జున్మోని మృతిపై సీఐడీతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే సీబీఐ ద్వారా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు ట్రక్ డ్రైవర్ అస్సాం పోలీసుల ముందు గురువారం లొంగిపోయాడు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుమిత్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ దుస్తుల్లో ఎగువ అస్సాం వైపు ఒంటరిగా జున్మోని రభా ఎందుకు వెళ్తుందని ప్రశ్నిస్తు్న్నారు. ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్యగా ఆమె తల్లి సుమిత్రా రభా ఆరోపించారు.
జున్మోని రభా ‘లేడీ సింగం’, ‘దబాంగ్ పోలీస్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినందుకు కాబోయే భర్తనే అరెస్ట్ చేసింది. దీంతో పాటు గతేడాది భుయాన్ బీజేపీ ఎమ్మెల్యేలతో వివాదంతో కూడా ఆమె పేరు వార్తల్లో వినిపించింది. పలు అవినీతి ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు రభా. ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!