Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జున్మోని శరీరం వెనకభాగంలో గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికి వెల్లడించింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక పలు అనుమానాలకు కారణం అవుతోంది.
పోస్టుమార్టం నివేదికతో అనుమానాలు:
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ఇదే కాకుండా ఆమె పక్కటెముకలు రెండు వైపు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట కారణంగా జున్మోని రభా మరణించిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆమె రెండు మోకాళ్లు, మోచేతులు, చేతులపై గాయాల కనిపించినట్లు తేలింది. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రణబ్ దాస్ ను నిన్న సాయంత్రం గౌహతి నుంచి నాగోన్ పోలీస్ స్టేషన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. తాను గౌహతి నుంచి వస్తున్న సమయంలో జున్మోని ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు ఎడమవైపున ఆపి ఉందని, అకాస్మత్తుగా ఓ లారీ వచ్చి కారును ఢీకొట్టిందని, ప్రమాదానికి ముందు ఓ నల్ల రంగు జీన్స్ ధరించిన వ్యక్తి కారు నుంచి దిగడం తాను చూశానని ప్రణబ్ దాస్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తాను కాసేపు ఉన్నానని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని జఖలాబాధ పోలీసులు ఆదేశించారని వెల్లడించారు.
Read Also: Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్పందించిన సీఎం..
ఈ కేసుపై సీఎం హిమంత బిశ్వసర్మ స్పందించారు. జున్మోని మృతిపై సీఐడీతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే సీబీఐ ద్వారా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు ట్రక్ డ్రైవర్ అస్సాం పోలీసుల ముందు గురువారం లొంగిపోయాడు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుమిత్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ దుస్తుల్లో ఎగువ అస్సాం వైపు ఒంటరిగా జున్మోని రభా ఎందుకు వెళ్తుందని ప్రశ్నిస్తు్న్నారు. ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్యగా ఆమె తల్లి సుమిత్రా రభా ఆరోపించారు.
జున్మోని రభా ‘లేడీ సింగం’, ‘దబాంగ్ పోలీస్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినందుకు కాబోయే భర్తనే అరెస్ట్ చేసింది. దీంతో పాటు గతేడాది భుయాన్ బీజేపీ ఎమ్మెల్యేలతో వివాదంతో కూడా ఆమె పేరు వార్తల్లో వినిపించింది. పలు అవినీతి ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు రభా. ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు.
తాజావార్తలు
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!