Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junmoni Rabha: అస్సాం మహిళా పోలీస్ అధికారి, ‘‘లేడీ సింగం’’గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ జున్మోని రభా కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో ఆమె మరణించింది. అయితే ఆమె మరణం పట్ల కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. తాజాగా ఆమె పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జున్మోని శరీరం వెనకభాగంలో గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికి వెల్లడించింది. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక పలు అనుమానాలకు కారణం అవుతోంది.
పోస్టుమార్టం నివేదికతో అనుమానాలు:
Also Read
ఇదే కాకుండా ఆమె పక్కటెముకలు రెండు వైపు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట కారణంగా జున్మోని రభా మరణించిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఆమె రెండు మోకాళ్లు, మోచేతులు, చేతులపై గాయాల కనిపించినట్లు తేలింది. మరోవైపు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ప్రణబ్ దాస్ ను నిన్న సాయంత్రం గౌహతి నుంచి నాగోన్ పోలీస్ స్టేషన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. తాను గౌహతి నుంచి వస్తున్న సమయంలో జున్మోని ప్రయాణిస్తున్న కారు రోడ్డుకు ఎడమవైపున ఆపి ఉందని, అకాస్మత్తుగా ఓ లారీ వచ్చి కారును ఢీకొట్టిందని, ప్రమాదానికి ముందు ఓ నల్ల రంగు జీన్స్ ధరించిన వ్యక్తి కారు నుంచి దిగడం తాను చూశానని ప్రణబ్ దాస్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తాను కాసేపు ఉన్నానని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని జఖలాబాధ పోలీసులు ఆదేశించారని వెల్లడించారు.
Read Also: Bandi Sanjay : ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
స్పందించిన సీఎం..
ఈ కేసుపై సీఎం హిమంత బిశ్వసర్మ స్పందించారు. జున్మోని మృతిపై సీఐడీతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తే సీబీఐ ద్వారా విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడు ట్రక్ డ్రైవర్ అస్సాం పోలీసుల ముందు గురువారం లొంగిపోయాడు. నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సుమిత్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ దుస్తుల్లో ఎగువ అస్సాం వైపు ఒంటరిగా జున్మోని రభా ఎందుకు వెళ్తుందని ప్రశ్నిస్తు్న్నారు. ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్యగా ఆమె తల్లి సుమిత్రా రభా ఆరోపించారు.
జున్మోని రభా ‘లేడీ సింగం’, ‘దబాంగ్ పోలీస్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినందుకు కాబోయే భర్తనే అరెస్ట్ చేసింది. దీంతో పాటు గతేడాది భుయాన్ బీజేపీ ఎమ్మెల్యేలతో వివాదంతో కూడా ఆమె పేరు వార్తల్లో వినిపించింది. పలు అవినీతి ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు రభా. ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు.
తాజావార్తలు
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!