Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Are Corrupt Officials In Telangana Under Sleepless Vigil Acb Intensifies Crackdown On Brs Era Irregularities

Off The Record: అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయా..?

Published Date :December 24, 2025 , 9:40 pm
By Sudhakar Ravula
  • అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయా?..
  • బీఆర్‌ఎస్‌ హయాంలో అక్రమాలకు పాల్పడిన వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుందా?..
  • ఒక్కో శాఖలో ఉన్నతాధికారుల పని తీరుపై నివేదికలు తెప్పించుకుందా?..
  • తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ అస్త్రం..
Off The Record: అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: తెలంగాణలో అవినీతి అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది ఏసీబీ. గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులపై ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించింది. రెండేళ్లలో వందలాది మంది అక్రమాలపై కేసులు నమోదు చేసింది. వందల కోట్ల నగదు, ఆస్తులను సీజ్ చేస్తూ అధికారులను జైలుకు పంపించింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, జిహెచ్ఎంసి, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ శాఖపై ఎసిబి దృష్టి సారించింది.

బీఆర్ఎస్ పాలనలో చక్రం తప్పిన కొందరు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ప్రభుత్వం మారినా ఆ పార్టీ ముఖ్యనేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. శాఖల వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. కొందరు ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. ప్రభుత్వంలో లేని వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కూడా సర్కారుకు నివేదికలు అందాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఉన్నతాధికారులు, ఇంజినీర్లను ఏసీబీ లక్ష్యంగా చేసుకుందనే చర్చ నడుస్తోంది.

బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన ఇంజినీర్లే లక్ష్యంగా ఏసీబీ దాడులు చేస్తుండటం శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తోందట. తదుపరి ఎవరిపై దాడులు జరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోందని టాక్‌. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ 2023లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం భారీ సీపేజీలు ఏర్పడ్డాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ జరిపించింది. ఏకంగా 38 మంది ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ విభాగం సిఫారసు చేసింది. దీంతో వీరికి సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పదోన్నతులను నిలుపుదల చేసింది. మరోవైపు…సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి బరాజ్ నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై సమాంతర విచారణ జరిపిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఏసీబీ అరెస్టుల పర్వానికి తెరతీసిందని సమాచారం.

నీటిపారుదల శాఖలో గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా రెండు కీలక హోదాల్లో కొనసాగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన భూక్యా హరిరామ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేసింది. ఎస్సారెస్పీ డివిజన్-8 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను ఆతర్వాత అరెస్టు చేసింది. 2011 ఆగస్టు 1 నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీగా కొనసాగుతున్న మురళీధర్రావు 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, తెలంగాణ వచ్చాక కూడా ఆయన అదే పోస్టులో కొనసాగారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శివబాలకృష్ణ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంతోపాటు దాదాపు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ దాదాపు 36 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారుల అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఆయనకు 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక రెవెన్యూశాఖలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు భారీ అవినీతికి పాల్పడినట్లు ఎసిబి కేసులు నమోదు చేసింది. సదరు అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిత్యకృత్యంగా మారింది. ప్రతీ రోజు ఎక్కడో ఒక దగ్గర సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు. మున్సిపల్ శాఖలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అవినీతి పెరిగి పోయింది. ఇటీవల నార్సింగి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anti-corruption bureau Telangana 2025
  • asset seizures ACB Telangana
  • BRS-era corruption probes
  • corrupt officials Telangana
  • disproportionate assets cases TS

తాజావార్తలు

  • Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!

  • Monalisa: “మోనాలిసా” చనిపోతానని బెదిరించింది, అందుకే పెళ్లి చేసుకున్నాం

  • Urea: రైతుల యూరియా కష్టాలకు చెక్.. ఆ జిల్లాలకు భారీగా బస్తాలు..

  • Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే

  • 120Hz LCD డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో iQOO Z11x 5G లాంచ్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions