Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 16 దళిత బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హుస్సేనాబాద్ లో జరిగింది. బాలికను కిడ్నాప్ చేసి, ఊరి చివరకు తీసుకెళ్లి ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి వైరల్ చేస్తామని సదరు బాలికను నిందితులు బెదిరించారు.
Gold Standard Burger: ‘బర్గర్’ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫాస్ట్ ఫుడ్ లో ఒకటి. తక్కువ ధర, తక్కువ సమయం అందుబాటులో ఉండటం, వెంటనే ఆకలి తీర్చడంలో బర్గర్ సహాయపడుతుంది. తక్కువ ధర, టేస్ట్ దీన్ని ప్రజలకు దగ్గర చేసింది. వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బర్గర్.. ఇప్పుడు భారత్ లో కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. పిల్లలు, పెద్దల్లో దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
PM Modi: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో సమావేశం అయ్యారు. శనివారం జపాన్లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇద్దరు నేతలు వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు మోడీ, జెలెన్ స్కీ టెలిఫోన్లలో మాత్రమే సంభాషించారు.
Kerala: 16 ఏళ్ల బాలుడు చనిపోయి మరో ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపాడు. 10 తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించడానికి రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన సారంగ్ 10వ తరగతిలో ఏ ప్లస్ గ్రేడ్ సాధించి టాపర్ గా నిలిచారు. సారంగ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత శుక్రవారం పదో తరగతి పరీక్షల్లో టాపర్ గా నిలవడం ఆ కుటుంబాన్ని మరింతగా బాధపడుతోంది.
MK Stalin: రూ. 2000 నోట్లను రద్దు చేస్తూ నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఇది తుగ్లక్ నిర్ణయమని, మరో విపత్తుకు నాంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. అర్వింద్ కేజ్రీవాల్, మల్లికార్జున ఖర్గే వంటి వారు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Supreme Court: ఏదైనా ఒక ఇంటిని కానీ, ఇతర భవనాలను అమ్ముతున్న సమయంలో పాత విద్యుత్ బిల్లును విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడం చూస్తుంటాం. ఇది కొత్తగా వాటిని కొనుగోలు చేసిన యజమానులపై పడుతుంది. అయితే వారు వాడిన కరెంట్ కు మేం ఎలా బిల్లు కడుతాం అనే ప్రశ్న ఇటువంటి సందర్భాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టిసారించారు.
Rahul Gandhi: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ఈ రోజు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తో పాటు 8 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూర్ లోని కంఠీరవ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్లోని బేస్మెంట్లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్మెంట్లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
PM Modi:రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోంది. తొలిసారిగా భారత ప్రధాని నరేంద్రమోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీతో తొలిసారి భేటీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ, జెలెన్స్కీ మధ్య వ్యక్తిగతంగా భేటీ కావడం ఇదే తొలిసారి.