Gyanvapi Mosque Case: జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. “శివలింగం” శాస్త్రీయ సర్వే వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన శివలింగానికి శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ చేయడానికి మే 12న అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాస్త్రీయ సర్వేను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడవాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: Sunrisers Fans : సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ గా యువరాజ్ సింగ్ని తీసుకు రండి..?
Also Read
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లోని చిక్కులను నిశితంగా పరిశించాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ ప్రక్రియను నిలిపివేశాయి. అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్, తర్వాత విచారణ తేదీ వరకు వాయిదా వేయాలని ఆదేశాలు ఇచ్చింది. శివలింగం శాస్త్రీయ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయడానికి కేంద్రం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, హిందూ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. శివలింగం శాస్త్రీయ సర్వేను ప్రస్తుతానికి వాయిదా వేయడానికి కేంద్ర, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రెండూ అంగీకరించాయి.
గతేడాది నుంచి వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వార్తల్లో నిలుస్తోంది. వారణాసిలోని దిగువ కోర్టు గతేడాది మసీదు వీడియో సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ వీడియో సర్వేలో భాగంగా మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం వంటి నిర్మాణం బయటపడింది. అయితే హిందువులు దీన్ని శివలింగంగా భావిస్తుంటే, ముస్లింపక్షం మాత్రం ఇది ఫౌంటెన్ అని చెబుతోంది. మసీదు కూడా కాశీవిశ్వనాథ కాంప్లెక్స్ లో భాగమే అని మసీదు గోడలపై దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో జ్ఞానవాపి మసీదు వివాదం తెరపైకి వచ్చింది. దీనికి మసీదు కమిటీ వ్యతిరేకిస్తోంది.
తాజావార్తలు
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!