Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.
Mosquito Bite: సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.
Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది.
Tata: దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా ఇటీవల తన కంపెనీలోని వివిధ సంస్థల సీఈవోల జీతాలను 16-62 శాతం పెంచింది. సాధారణ టీసీఎస్ ఉద్యోగి ఏడాదికి లక్షల్లో వేతనం తీసుకుంటాడు.
Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు.
Maharashtra: మహరాష్ట్రలో పాలక బీజేపీ- శివసేన(ఏక్ నాథ్ షిండే) కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓ పత్రికా ప్రకటన ఈ రెండు పార్టీల మధ్య విబేధాలకు కారణం అవుతోంది. ‘‘దేశంలో మోడీ.. మహారాష్ట్రలో షిండే’’ అనే ట్యాగ్ లైన్ తో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ పత్రికా ప్రకటన వేయించింది.
TCS: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. హైబ్రీడ్ మోడ్ లో ఉద్యోగాలు చేయాలని చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇప్పటికే దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసుకలు రమ్మని కోరింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నాయి.
Producer T.G. Vishwaprasad: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు మొత్తం పదికి పైగా సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.