Producer T.G. Vishwaprasad: పాన్ వరల్డ్, హాలీవుడ్ ప్రాజెక్టులే మా టార్గెట్..
Producer T.G. Vishwaprasad: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు మొత్తం పదికి పైగా సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ. ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సినిమా జూన్ 16న విడుదలవుతున్న నేపథ్యంలో విలేకరులతో సమావేశమై తమ భవిష్యత్ ప్రణాళికను వివరించారు టి.జి. విశ్వప్రసాద్. ‘ఆదిపురుష్’ ట్రైలర్ విజువల్గా బాగుంది. ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని భావించి మార్కెట్ బేరీజువేసుకుని తెలుగు రైట్స్ తీసుకున్నామంటున్నారు విశ్వప్రసాద్. అంతేకాదు భవిష్యత్ లో టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన కుదుర్చుకున్నామని, అందులో భాగంగానే ‘స్పిరిట్’ సినిమాని కూడా తెలుగులో తామే విడుదల చేస్తామన్నారు.
Read Also: Bhola Shankar: 1988లో చివరి సినిమా.. ‘భోళాశంకర్’ చిరంజీవి ఆగస్ట్ సక్సెస్ రేటు పెంచేనా!?
Also Read
- Buchi Babu: 'పెద్ది'ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
- Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. 'పెద్ది' లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తమను కుటుంబసభ్యుడు లాంటివారు అనటంపై స్పందిస్తూ ప్రభాస్ అందరితో మంచిగా ఉంటారు. ఆయనతో అనుబంధం తమ అదృష్టమన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ను ఒక ఫ్యాక్టరీ మోడల్ లో స్టార్ట్ చేశామని, అదృష్టం కొద్దీ సక్సెస్ శాతం ఎక్కువగానే ఉందని, ఈ జర్నీలో పరాజయం ఎదురైనా పునరావృతం కాకుండా పరాజయాల నుంచి కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళతామని, ఫాస్ట్ గా వంద సినిమాల నిర్మాణం ఇటీవల పెట్టుకున్న లక్ష్యమని అందులో తొలి 25 సినిమాలకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నామని, తదుపరి 25 సినిమాలను వేగంగా ఏడాదిన్నరలో పూర్తి చేస్తామంటున్నారు విశ్వప్రసాద్. ప్రస్తుతం 5 సినిమాల నిర్మాణం పూర్తయిందని, 15 దాకా నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఓటీటీ బిజినెస్ చాలా కీలకంగా మారిందన్నారు.
తెలుగు రాష్ట్రాలలో ‘ఆదిపురుష్’ టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగిందని, రెండు ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. హనుమంతుడికి ప్రతి థియేటర్ లో సీటు కేటాయించడం ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనమంటూ ఉచితంగా టికెట్లు అనేది పబ్లిసిటీ స్టంట్ కాదని, ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో కొందరు ముందుకు వచ్చి చేస్తున్నారన్నారు. సెట్స్ మీద ఉన్న 15 సినిమాల ద్వారా పరిశ్రమకు పలువురు కొత్త దర్శకులని కూడా పరిచయం చేయబోతున్నామని, వాటిలో ఎనిమిది నుంచి పది వరకు కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలే అన్నారు. వచ్చే రెండుమూడేళ్ళలో ప్యాన్ వరల్డ్, హాలీవుడ్ సినిమాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్టీఆర్ శతజయంతికి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టాలి అని అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నామని, కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, త్వరలో విగ్రహం ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు విశ్వప్రసాద్.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!