Rajnath Singh: ప్రియాంకా గాంధీ “సీజనల్ హిందువు”.. కేంద్రమంత్రి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.
రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి ప్రజలను వచ్చించేందుకు కాంగ్రెస్ ఐదు హామీలను ఇస్తోందని ఆరోపించారు. రాజ్గఢ్లో జరిగిన ‘కిసాన్ కళ్యాణ్ మహాకుంభ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రోజు ప్రియాంకా గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ రాజ్ నాథ్ సింగ్.. ‘‘ కాంగ్రెస్ లో కొందరు వ్యక్తులు సీజనల్ హిందువులుగా మారారు. ఇంతకు ముందు నర్మదా జీని ఎందుకు గుర్తుకు రాలేదని, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది.’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు సమావేశాలు, కార్యక్రమాలు పెట్టి హనుమంతుడి గదను మోస్తున్నారని, ఇంతకుముందు వారు రాముడు, హనుమాన్ పేర్లను ఉచ్చరించే వారు కాదని ఆయన అన్నారు.
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
Read Also: Mosquito Bite: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఐదు హామీలు ఇస్తామని చెబుతోందని, కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంది కానీ ఎప్పుడు నెరవేర్చదని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీజేపీ హామీలను నెరవేరుస్తుందన్నారు. సీఎం శివరాజ్ సింగ్ కు ప్రజామద్దతు ఉందని, ఈసారి మరింత మెజారిటీతో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వ్యవసాయ బడ్జెట్ ను రూ. 25,000 కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిందని, రామమందిర నిర్మాణాన్ని చేపడుతోందని, రక్షణ రంగంలో అభివృద్ది చెందామని, మహిళ కోసం సైనిక్ స్కూల్స్ తో పాటు ఆర్మీలో మహిళలు ఎక్కువగా చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని 60 లక్షల ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చామని రక్షణ మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!