Rajnath Singh: ప్రియాంకా గాంధీ “సీజనల్ హిందువు”.. కేంద్రమంత్రి విమర్శలు..
Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.
రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి ప్రజలను వచ్చించేందుకు కాంగ్రెస్ ఐదు హామీలను ఇస్తోందని ఆరోపించారు. రాజ్గఢ్లో జరిగిన ‘కిసాన్ కళ్యాణ్ మహాకుంభ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రోజు ప్రియాంకా గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ రాజ్ నాథ్ సింగ్.. ‘‘ కాంగ్రెస్ లో కొందరు వ్యక్తులు సీజనల్ హిందువులుగా మారారు. ఇంతకు ముందు నర్మదా జీని ఎందుకు గుర్తుకు రాలేదని, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది.’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు సమావేశాలు, కార్యక్రమాలు పెట్టి హనుమంతుడి గదను మోస్తున్నారని, ఇంతకుముందు వారు రాముడు, హనుమాన్ పేర్లను ఉచ్చరించే వారు కాదని ఆయన అన్నారు.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
Read Also: Mosquito Bite: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఐదు హామీలు ఇస్తామని చెబుతోందని, కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంది కానీ ఎప్పుడు నెరవేర్చదని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీజేపీ హామీలను నెరవేరుస్తుందన్నారు. సీఎం శివరాజ్ సింగ్ కు ప్రజామద్దతు ఉందని, ఈసారి మరింత మెజారిటీతో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వ్యవసాయ బడ్జెట్ ను రూ. 25,000 కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిందని, రామమందిర నిర్మాణాన్ని చేపడుతోందని, రక్షణ రంగంలో అభివృద్ది చెందామని, మహిళ కోసం సైనిక్ స్కూల్స్ తో పాటు ఆర్మీలో మహిళలు ఎక్కువగా చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని 60 లక్షల ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చామని రక్షణ మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!