Sanjay Raut: 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. ఉద్దవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. శనివారం నాందేడ్ లో జరిగిన అమిత్ షా ర్యాలీని సంజయ్ రౌత్ ప్రస్తావసి్తూ.. ఉద్ధవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడటం విశేషం అన్నారు.
IndiGo: అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ పాకిస్తాన్ లోకి వెళ్లింది. ప్రతికూల వాతావరణం కారణంగా లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత భూభాగంలోకి వచ్చింది.
Long Covid-19: కోవిడ్ 19 వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. చైనాలోని వూహాన్ నగరంలో 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్, అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీని వల్ల పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ, వివిధ వేరియంట్ల రూపంలో మనుషులపై అటాక్ చేసింది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో కోవిడ్ సంక్రమిస్తూనే ఉంది.
Supernova: ఈ విశ్వం ఎన్నో అద్భుతాలకు నెలువు. కొన్ని కోట్ల గెలాక్సీలు, అందులో కొన్ని వందల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఇలా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అయితే ప్రతీ నక్షత్రానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. అయితే నక్షత్రాల చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఎంతలా అంటే దాని విస్పోటనం కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు కనిపిస్తుంటుంది. అంత విధ్వంసకర రీతిలో ఈ నక్షత్రాల మరణం ఉంటుంది.
Netherlands: యూరోపియన్ దేశం నెదర్లాండ్స్ లోని ఓ పట్టణంలో ప్రజల డిమాండ్ కు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. దేశంలోని వీరే పట్టణంలోని సముద్రం బీచ్ లో సెక్స్ కు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు గళమెత్తారు. బీచుల్లో పబ్లిక్ గా సెక్స్ చేయడంపై అక్కడి స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికి వ్యతిరేకంగా బీచుల్లోని ఇసుకదిబ్బలు, ఇతర ప్రాంతాల్లో సెక్స్ లో పాల్గొనకుండా నిరొధించే ప్రచారాన్ని ప్రారంభించారు.
Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
Marriage Record: రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పెళ్లిళ్లలో రికార్డ్ క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బారాన్ లో మే 26న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించింది.
AAP: కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆదివారం మహా ర్యాలీ నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు నిర్వహించిన మహార్యాలీలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై కేజ్రవాల్ విరుచుకుపడ్డాడు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.