Venu Goapl Reddy
Author- NTV Telugu-
Madhya Pradesh: బీజేపీకి ఓటేసినందుకు ముస్లిం మహిళపై దాడి.. బాధితురాలిని కలిసిన సీఎం..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే పరిమితమైంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది. -
MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి..
MP Danish Ali: వివాదాస్పద ఎంపీ డానిష్ అలీని పార్టీ నుంచి బహిష్కరిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్లో డానిష్ అలీ, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనపై రమేష్ బిధూరి మతపరమైన వివక్ష, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ డానిష్ అలీ ఆరోపించారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. -
Artificial intelligence (AI): ఏఐతో మహిళల న్యూడ్ ఫోటోలు.. నెలలోనే అలాంటి వెబ్సైట్లను వీక్షించిన 2.4 కోట్ల మంది..
Artificial intelligence (AI): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ప్రస్తుతం ప్రపంచదేశాలు దృష్టి సారించాయి. అయితే కొంతమంది టెక్ దిగ్గజాలు ఏఐతో రాబోయ కాలంలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తుండగా.. మరికొందరు మానవుల జీవనాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ఇటీవల డీఫ్ఫేక్ వీడియోలు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల మార్ఫుడ్ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఏఐని దుర్వినియోగం చేయడంపై ఏకంగా ప్రధాన మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. -
France: మహ్మద్ ప్రవక్తని కించపరిచాడని ఫ్రెంచ్ టీచర్ శిరచ్ఛేదం.. దోషులుగా 6 టీనేజర్లు..
France: ఫ్రాన్స్తో పాటు బెల్జియం, ఇతర యూరోపియన్ దేశాల్లో ఇస్లాం రాడికలైజేషన్ పెరుగుతోంది. పలువురు ఆయా దేశాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే 2020లో ఫ్రెంచ్ ఉపాధ్యాయుడు శామ్యూల్ పాటీని తల నరికి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో ఆరుగురు టీనేజర్లను ఫ్రెంచ్ కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. -
Ashok Gehlot: “ఇదే కాంగ్రెస్ చేస్తే ఊరుకునేదా..?” బీజేపీపై మాజీ సీఎం గెహ్లాల్ విమర్శలు..
Ashok Gehlot: 2024 లోక్సభ ఎన్నికల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీలో బీజేపీ గెలిచింది. అయితే ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికపై మాత్రం బీజేపీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది. ఫలితాలు వెలువడి ఆరు రోజులు గడుస్తున్నా.. సీఎంలను ఖరారు చేయలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. -
Nawaz Sharif: “కార్గిల్ యుద్ధాన్ని వద్దన్నందుకే నన్ను తొలగించారు”.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. -
World’s largest office building: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్.. డిసెంబర్ 17న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం..
World's largest office building: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మనదేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్లోని సూరత్ నగరంలో ఈ బిల్డింగ్ నిర్మించబడింది. కొత్తగా నిర్మించింది. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు. -
Assam: “అస్సాం ఒకప్పుడు మయన్మార్లో అంతర్భాగం”.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై హిమంత ఆగ్రహం..
Assam: అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు. -
BJP: రాహుల్గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది. -
Israel-Hamas War: ఇజ్రాయిల్ చెప్పే దానికి, చేసేదానికి చాలా తేడా ఉంది.. తొలిసారి యూఎస్ ఆగ్రహం..
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మందిని చంపేసింది. మరో 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి రావడంతో కొందరు బందీలను హమాస్ రిలీజ్ చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. గత వారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ముగియడంతో మరోసారి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది.
తాజావార్తలు
-
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
-
Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
-
Raja Muthupandi: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్లిఫ్టింగ్లో రజతం గెలుచిన రాజా ముత్తుపాండి
-
Weather Forecast Today: వాయుగుండం ప్రభావం.. ఇవాళ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!
-
NEET UG Protest: విద్యార్థులు అరచి గెలిచారు.. నీట్ ఉద్యమంపై టాలీవుడ్ అగ్రతారల గొంతు మూగబోయిందా ?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!