Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది.
అయితే ఇలాంటి దేశంలో చివరకు ప్రజలు ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీల్లేదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలపై కిమ్ అక్కడి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏకంగా అక్కడ 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఆత్మహత్యలను సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా కిమ్ అభివర్ణించారు. ప్రజల ఆత్మహత్యలకు అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఇకపై ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులదే బాధ్యత అన్నమాట.
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Read Also: India Tour: ఇండియాలో పాకిస్థానీ వ్లాగర్ బైక్ టూర్.. !
ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా సంస్థ తెలియజేసింది. నార్త్ కొరియా ఈశాన్య ప్రాంతం హామ్ యాంగ్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి, కిమ్ అన్ని ప్రావిన్సుల్లోని అధికారులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు రేడియో ఫ్రీ ఆసియాకు తెలియజేశాడు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాలు కూడా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. నార్త్ కొరియాలోని మరో ప్రావిన్స్ ర్యాంగ్యాంగ్ లో ఆకలి చావుల కన్నా ఆత్మహత్యలతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. అయితే కిమ్ ఆదేశాలు జారీ చేశారు కానీ వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తర కొరియాలో పేదరికం, ఆకలి కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో వేరే దేశంతో సంబంధాలు లేకుండా కిమ్ తన పాలనను కొనసాగిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా అమెరికాను బూచిగా చూపి అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను నూరిపోస్తున్నాడు. క్షిపణులు, ఆయుధాలకు ఖర్చు పెడుతుంది తప్పితే ప్రజల సంక్షేమాన్ని ఆలోచించడం లేదు అక్కడి ప్రభుత్వం. చిత్ర విచిత్రమైన రూల్స్, కఠినమైన శిక్షలు ప్రజలను మానసిక వేధనకు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!