Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: నార్త్ కొరియా గురించి పెద్దగా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అడపాదడపా వివరాలు తప్పితే పెద్దగా అక్కడి సమచారం బయటకు రాదు. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే నార్త్ కొరియా ప్రజలకు వేరే ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియదు. తమకు తెలిసినంత వరకు కిమ్ కుటుంబమే దేవుళ్లు, కిమ్ చెప్పిందే నిజం. అంతలా ఆ దేశం నిర్బంధానికి గురవుతోంది.
అయితే ఇలాంటి దేశంలో చివరకు ప్రజలు ప్రశాంతంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీల్లేదని కిమ్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలపై కిమ్ అక్కడి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏకంగా అక్కడ 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఆత్మహత్యలను సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా కిమ్ అభివర్ణించారు. ప్రజల ఆత్మహత్యలకు అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఇకపై ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులదే బాధ్యత అన్నమాట.
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
Read Also: India Tour: ఇండియాలో పాకిస్థానీ వ్లాగర్ బైక్ టూర్.. !
ఈ విషయాన్ని రేడియో ఫ్రీ ఆసియా సంస్థ తెలియజేసింది. నార్త్ కొరియా ఈశాన్య ప్రాంతం హామ్ యాంగ్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి, కిమ్ అన్ని ప్రావిన్సుల్లోని అధికారులకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు రేడియో ఫ్రీ ఆసియాకు తెలియజేశాడు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన వారి వివరాలు కూడా వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. నార్త్ కొరియాలోని మరో ప్రావిన్స్ ర్యాంగ్యాంగ్ లో ఆకలి చావుల కన్నా ఆత్మహత్యలతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు. అయితే కిమ్ ఆదేశాలు జారీ చేశారు కానీ వీటిని ఎలా అడ్డుకోవాలో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తర కొరియాలో పేదరికం, ఆకలి కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో వేరే దేశంతో సంబంధాలు లేకుండా కిమ్ తన పాలనను కొనసాగిస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా అమెరికాను బూచిగా చూపి అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను నూరిపోస్తున్నాడు. క్షిపణులు, ఆయుధాలకు ఖర్చు పెడుతుంది తప్పితే ప్రజల సంక్షేమాన్ని ఆలోచించడం లేదు అక్కడి ప్రభుత్వం. చిత్ర విచిత్రమైన రూల్స్, కఠినమైన శిక్షలు ప్రజలను మానసిక వేధనకు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!