TCS: ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్న మహిళా టెక్కీలు.. కారణం ఇదే..
TCS: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. హైబ్రీడ్ మోడ్ లో ఉద్యోగాలు చేయాలని చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇప్పటికే దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసుకలు రమ్మని కోరింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం పాలసీ కారణంగా టీసీఎస్ సంస్థలో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసకు రావాల్సిందిగా కోరింది. దీంతో చాలా మంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుకోవడం, ఆఫీసులకు వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని కోరినందుకే మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారని టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు.
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
మహిళా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలనుకోవడం వల్ల ఎక్కువ మంది రాజీనామాలు చేశారని లక్కాడ్ నొక్కి చెప్పారు. ఇది కూడా ఒక కారణం కావచ్చని, వివక్షకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంత మంది మహిళా ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారనే దాని గురించి స్పష్టమైన సంఖ్యను టీసీఎస్ వెల్లడించలేదు. టీసీఎస్ లో మహిళా ఉద్యోగులు అట్రిషన్ రేట్ పురుషులతో సమానం లేదా కాస్త తక్కువగా ఉంది.
జెండర్ డైవర్సిటీని ప్రోత్సహించడంలో టీసీఎస్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని, దీన్ని కంటిన్యూ చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టీసీఎస్ లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. నాలుగింట మూడోవంతు మహిళలు టాప్ పోజిషన్లలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దాదాపుగా 20 శాతం అంటే లక్ష మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసులకు వస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!