TCS: ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్న మహిళా టెక్కీలు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. హైబ్రీడ్ మోడ్ లో ఉద్యోగాలు చేయాలని చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇప్పటికే దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసుకలు రమ్మని కోరింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం పాలసీ కారణంగా టీసీఎస్ సంస్థలో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసకు రావాల్సిందిగా కోరింది. దీంతో చాలా మంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుకోవడం, ఆఫీసులకు వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని కోరినందుకే మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారని టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
మహిళా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలనుకోవడం వల్ల ఎక్కువ మంది రాజీనామాలు చేశారని లక్కాడ్ నొక్కి చెప్పారు. ఇది కూడా ఒక కారణం కావచ్చని, వివక్షకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంత మంది మహిళా ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారనే దాని గురించి స్పష్టమైన సంఖ్యను టీసీఎస్ వెల్లడించలేదు. టీసీఎస్ లో మహిళా ఉద్యోగులు అట్రిషన్ రేట్ పురుషులతో సమానం లేదా కాస్త తక్కువగా ఉంది.
జెండర్ డైవర్సిటీని ప్రోత్సహించడంలో టీసీఎస్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని, దీన్ని కంటిన్యూ చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టీసీఎస్ లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. నాలుగింట మూడోవంతు మహిళలు టాప్ పోజిషన్లలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దాదాపుగా 20 శాతం అంటే లక్ష మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసులకు వస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.
తాజావార్తలు
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
-
spirit : స్పిరిట్ పోస్ట్పోన్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
-
Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
December Clash : డిసెంబర్ రేస్లో రెబల్ స్టార్ vs కింగ్ ఖాన్
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!