TCS: ఉద్యోగానికి గుడ్ బై చెబుతున్న మహిళా టెక్కీలు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. హైబ్రీడ్ మోడ్ లో ఉద్యోగాలు చేయాలని చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇప్పటికే దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసుకలు రమ్మని కోరింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం పాలసీ కారణంగా టీసీఎస్ సంస్థలో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసకు రావాల్సిందిగా కోరింది. దీంతో చాలా మంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుకోవడం, ఆఫీసులకు వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని కోరినందుకే మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారని టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు.
Also Read
- Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
మహిళా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలనుకోవడం వల్ల ఎక్కువ మంది రాజీనామాలు చేశారని లక్కాడ్ నొక్కి చెప్పారు. ఇది కూడా ఒక కారణం కావచ్చని, వివక్షకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంత మంది మహిళా ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారనే దాని గురించి స్పష్టమైన సంఖ్యను టీసీఎస్ వెల్లడించలేదు. టీసీఎస్ లో మహిళా ఉద్యోగులు అట్రిషన్ రేట్ పురుషులతో సమానం లేదా కాస్త తక్కువగా ఉంది.
జెండర్ డైవర్సిటీని ప్రోత్సహించడంలో టీసీఎస్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని, దీన్ని కంటిన్యూ చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టీసీఎస్ లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. నాలుగింట మూడోవంతు మహిళలు టాప్ పోజిషన్లలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దాదాపుగా 20 శాతం అంటే లక్ష మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసులకు వస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.
తాజావార్తలు
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!