Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని కూతురుని చంపిన పేరెంట్స్..
- కరీంనగర్ జిల్లాలో పరువు హత్య..
- సైదాపూర్ మండలం శివరామ్ పల్లిలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour Killing: తెలంగాణలో మరో పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలోని ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన యువకుడితో ప్రేమ వ్యవహారం.. కుటుంబానికి తెలియడంతో ఈ ఘాతుకం జరిగినట్టుగా పోటీసులు చెబుతున్నారు.. గ్రామానికే చెందిన, ఇప్పటికే వివాహం చేసుకున్న ఒక యువకుడితో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ప్రేమాయణం సాగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ యువకుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత, వారు మొదట కూతురిని తీవ్రంగా మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, తల్లిదండ్రులు ఘాతుకానికి పాల్పడ్డారని విచారణలో తేలింది.
Read Also: Pragati: ‘అలాంటి వాళ్లు భూమికి భారం… పెట్రోల్ పోసి కాల్చిపడేస్తా’
Also Read
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- PMJ Jewellers : PMJ దోపిడీ ట్విస్ట్.. మాస్టర్మైండ్ ఎవరు.?
గత నెల నవంబర్ 14, 2025న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూతురిని బలవంతంగా పురుగుల మందు తాగించి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం, తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తల్లిదండ్రులే పోలీసుల వద్దకు వెళ్లి, కడుపునొప్పితో బాధపడుతూ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.. అయితే, బాధిత యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, గ్రామస్థుల సమాచారాన్ని సేకరించిన అనంతరం, తల్లిదండ్రులే తమ కూతురిని హత్య చేశారని పోలీసులు తేల్చారు.
కేసు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో, పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో మధ్యవర్తుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, యువకుడి ప్రమేయం వంటి అంశాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. ఒక వైపు ప్రేమ వ్యవహారం, మరో వైపు పరువు పేరుతో తీసుకున్న ప్రాణం కారణంగా శివరామ్పల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మరోసారి సమాజంలో పరువు హత్యల నిర్మూలన, యువతలో అవగాహన, కుటుంబ కౌన్సెలింగ్ అవసరంపై చర్చకు తెరలేపింది.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..