PM Modi: ప్రధాని మోడీ అమెరికా పర్యటన.. బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్కి రెడీ అవుతున్న హక్కుల సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ మోడీకి విందు ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటనపై యావత్ అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు, వ్యాపారం-వాణిజ్యం పెరుగుదలకు మోడీ పర్యటన సహకరిస్తుందని అక్కడి మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా వైపు నిలవడం, ప్రపంచ వ్యాప్తంగా అలుముకుంటున్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లబోతున్నారు.
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి హక్కుల సంఘాలు, మోడీకి వ్యతిరేకంగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నాయి. బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ని ప్రదర్శించేందుకు రెండు హక్కుల సంఘాలు నిర్ణయించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ జూన్ 20న వాషింగ్టన్ లో ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. పాత్రికేయులు, విశ్లేషకులు దీనికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2002లో గుజారాత్ అల్లర్ల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించింది బీబీసీ. ఇందులో మోడీ హస్తం ఉన్నట్లుగా ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీ భారత్ లో సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు ఈ డాక్యుమెంటరీకి మద్దతు నిలువగా.. బీజేపీ దీన్ని కొట్టిపారేసింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో లింక్ లను తొలగించాలని యూట్యూబ్, ట్విట్టర్ లను కేంద్రం ఆదేశించింది. పలు వర్సిటీలు దీన్ని స్క్రీనింగ్ చేయకుండా నిషేధించాయి. ఈ డాక్యుమెంటరీ తరువాత బీబీసీ ముంబై, ఢిల్లీ ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఐటీ ఈ రైడ్స్ చేసింది.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!