Mosquito Bite: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mosquito Bite: సాధారణంగా దోమలు మనుషుల్ని కుడుతాయి. ఇందులో పెద్ద వింతేముందని మీరు అనుకోవచ్చు. అయితే కొందరిని మాత్రం దోమలు ఎక్కువగా కుడుతుండటం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అయితే ఇందుకు ఓ కొత్త కారణాన్ని పరిశోధకులు వెల్లడించారు. మీరు వాడే సబ్బు కూడా దోమలు కట్టడాన్ని ప్రభావితం చేస్తాయని, దోమల్ని ఆకర్షిస్తాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.
సాధారణంగా రక్తం దొరకనప్పుడు దోమలు మొక్కల్లోని చెక్కరను ఆహారంగా తీసుకుంటాయి. పండ్లు, పువ్వులను వచ్చే సువాసలకు సాధారణంగా మనుషులు ఆకర్షితం అవుతుంటారు. అయితే ఇదే విధంగా మనుషులు వాడే సబ్బుల నుంచి వచ్చే సువాసనలు కూడా దోమల్ని ఎక్కువగా ఆకర్షించడాన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుందని వర్జీనియాలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ టెక్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఐసైన్స్ జర్నల్ లో ప్రచురించారు.
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
Read Also: Kim Jong Un: ప్రజలు ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ ఆదేశాలు..
ఈ రిసెర్చ్ కు నాయకత్వం వహిస్తున్న పరిశోధకుడు క్లెమెంట్ వినాగర్ మాట్లాడుతూ.. సబ్బుల నుంచి వచ్చే సువాసనలు, దోమల్ని ఆకర్షించవచ్చని వెల్లడించారు. నలుగురు వాలంటీర్ల సహాయంతో సబ్బులు, దోమలకు ఉన్న ఆకర్షణ బంధంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మొదటగా వారు ప్రతీ వ్యక్తి నుంచి వచ్చే వాసనను అధ్యయనం చేసి, వారిని ఒకసారి సబ్బులు వినియోగించకుండా, మరోసారి మూడు రకాల సబ్బులను ఉపయోగించేలా చేసి ప్రయోగం నిర్వహిచారు. సబ్బులను వాడిన తర్వాత 60 శాతం ఎక్కువగా వారి శరీరం నుంచి వచ్చే వాసన కాకుండా సబ్బు వాసన వస్తున్నట్లు కనుగొన్నారు.
మన శరీరవాసనకు సబ్బు వాసనను జోడించడమే కాకుండా.. కొన్ని రసాయనాలను కూడా శరీరానికి అంటిస్తున్నాయని తేలిందని క్లెమెంట్ వినాగర్ చెప్పారు. సహజ రసాయనాలు, సబ్బు రసాయనాల మధ్య పరస్పర చర్య ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా దోమలు పోషకాలను కనుగొనేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను ఉపయోగిస్తాయి. వాసనల మధ్య పరస్పర చర్యలను పరీక్షించడానికి, పరిశోధకులు దోమలను మెష్ లో విడుదల చేశారు. నలుగురితో పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో విచిత్రంగా సబ్బులు వాడిన ముగ్గురు వ్యక్తులు దోమల్ని ఎక్కువగా ఆకర్షించగా.. ఒకరిని మాత్రం పెద్దగా దోమలు ఆకర్షించలేదు. ముఖ్యంగా పువ్వులు, పండ్ల నుంచి వచ్చే వాసనలు కలిగిన సబ్బులు దోమల్ని ఎక్కువగా ఆకర్షించగా.. కొబ్బరి సువాసన కలిగిన సబ్బు దోమల్ని పెద్దగా ఆకర్షించలేదు.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!