Venu Goapl Reddy
Author- NTV Telugu-
BJP: “జిన్నా ఆత్మ ఓవైసీలోకి ప్రవేశించింది”.. కేంద్రమంత్రి విమర్శలు..
BJP: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాల విమర్శలకు అధికార బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయంటూ మండిపడింది. తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు. పార్లమెంట్ చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో వారికి కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. -
MP Dhiraj Sahu: “నా డబ్బు కాదు, కానీ”..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..
MP Dhiraj Sahu: "నా డబ్బు కాదు, కానీ"..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..ఇటీవల ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఏకంగా రూ. 350 కోట్ల నగదు పట్టుబడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. గుట్టలు, గుట్టలుగా పట్టుబడిన నోట్ల కట్టల్ని లెక్కించేందుకు వందలాది మంది అధికారులు, పదుల సంఖ్యలో మిషన్లు అలసిపోయాయి. -
Cockroach: బొద్దింకను చంపేందుకు ప్రయత్నించి ఇంటిని తలబెట్టుకున్నాడు..
Cockroach: బొద్దింకలు ఇంట్లో చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని పారదోలేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. స్ప్రేలు, ఇతర రసాయనాలను వాడుతుంటారు. కానీ జపాన్లో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నిస్తూ తన సొంత అపార్ట్మెంట్ని తగలబెట్టుకున్నాడు. -
Russia: “ఇంట్లో కూర్చుని, ఎక్కువ మంది సైనికులకు జన్మనివ్వండి”.. జనాభా సంక్షోభంలో రష్యా..
Russia: రష్యాలో తక్కువ జననాల రేటు ఆ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. చివరకు అధ్యక్షుడు పుతిన్ కూడా రష్యా మహిళలని ఎక్కువ పిల్లల్ని కనాలని సూచించారు. ఇదిలా ఉంటే రష్యాలో దీర్ఘకాలికంగా ఉన్న సంప్రదాయాలు మారేలా కనిపిస్తు్న్నాయి. మహిళలకు అబార్షన్లు చేసుకునే దీర్ఘకాలిక హక్కు ప్రశ్నార్థకంగా మారుతోంది. రష్యాలో గత దశాబ్ధాలుగా చట్టపరమైన గర్భస్రావాలకు అనుమతి ఉంది. -
Maldives: నీటి సర్వేపై భారత్తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..
Maldives: మాల్దీవుల్లో చైనా అనుకూల వ్యక్తి మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడు కాగానే.. భారత వ్యతిరేక వైఖరి అవలంభిస్తున్నాడు. ఇప్పటికే ద్వీపదేశంలో ఉన్న భారత సైనికులను వెళ్లాల్సిందిగా కోరాడు. ఇప్పుడు మరో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాడు. భారత్తో కలిసి మాల్దీవులు చేస్తున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ఆ దేశం చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మాల్దీవుల పబ్లిక్ పాలసీ అండర్ సెక్రటరీ మహ్మద్ ఫిరుజుల్ మాట్లాడుతూ.. -
Uttar Pradesh: మైనర్పై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష
Uttar Pradesh: మైనర్పై అత్యాచారానికి పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఉత్తర్ప్రదేశ్ బీజేపీ ఎమ్యెల్యేకి శిక్ష ఖరారైంది. తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2014లో ఈ నేరం జరిగింది. బాధితురాలి సోదరుడు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. అయితే కుటుంబంపై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డాడు. -
Court Cases: దేశంలోని కోర్టుల్లో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. సుప్రీంలో 80 వేల కేసులు..
Court Cases: దేశంలోని వివిధ కోర్టుల్లో కేసుల సంఖ్య పేరుకుపోతోంది. భారత న్యాయవ్యవస్థలో ఎప్పటికైనా న్యాయం లభిస్తుంది, కానీ దానికి కొంత సమయం పడుతుందని అంతా చెబుతుంటారు. కొన్ని కేసులు దశాబ్ధాలు పాటు కొనసాగుతుంటాయి. తాజాగా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
Ashwini Vaishnaw: లోకో పైలట్లు తాగి విధులకు వస్తున్నారా..? ఐదేళ్లలో బ్రీత్లైజర్ టెస్టుల్లో 1761 మంది ఫెయిల్..
Ashwini Vaishnaw: రైల్వేలో ఒక్క పొరపాటు, ఒక్కరి తప్పు వేల మందిని బలిగొంటుంది. అలాంటి రైల్వేలో సిబ్బంది, లోకో పైలట్లకు సంబంధించి పరీక్షలు కూడా నిక్కచ్చిగా ఉంటాయి. తాజాగా రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రైల్వే అధికారులు మొత్తం 8,28,03,387 బ్రీత్లైజర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. -
Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..
Tipu Sultan Row: కర్ణాటకలో మరోసారి టిప్పు సుల్తాన్ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో టిప్పు పేరు రాజకీయంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. మరోసారి మైసూరు విమానాశ్రయం పేరు మార్పు వివాదం నేపథ్యంలో టిప్పు వివాదం రాజుకుంది. మైసూర్ ఎయిర్ పోర్టు (మందకల్లి విమానాశ్రయం) పేరును టిప్పు సుల్తాన్ విమానాశ్రయంగా మార్చాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. -
IPL 2024: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మకి చెక్..
IPL 2024: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్కి కొత్త కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మను పక్కన పెట్టింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ఎంఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AK 47: వెంకటేష్ ‘చిట్టిబాబు’ ల్యాండింగ్.. సంక్రాంతి కాదు, ఈసారి దసరాకే!
-
Dharmendra Pradhan: రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. ఘన స్వాగతం పలికిన ఎన్డీఏ ఎంపీలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
-
Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
-
Bhatti Vikramarka: ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదు.. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!