Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ లోలోపల భయపడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పులు, ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్, భారత ఎదుగుదల, ప్రధాని నరేంద్రమోడీకి దొరుకుతున్న గౌరవాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. తాజాగా ప్రధాని అమెరికా పర్యటనపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిప్ స్పందించారు. భారత్తో అమెరికా తన సంబంధాలను మరింతగా పెంచుకోవడంతో ఇస్లామాబాద్కు ఎలాంటి సమస్య లేదని అన్నారు. అయితే పాకిస్తాన్ కు నష్టం కలిగించకపోతే, భారతదేశంతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్న అమెరికాతో మాకు ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు.
Read Also: Mahindra’s Armado: ఆర్మీ కోసం మహీంద్రా “ఆర్మడో”.. బండి మామూలుగా లేదుగా..!
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
కాశ్మీర్ సమస్యపై గురించి అడిగిన ప్రశ్నకు బదులుగా.. పాకిస్తాన్ తన పొరుగు దేశాలు, ప్రాంతీయ భాగస్వాములతో సత్సంబంధాలను కోరుకుంటోందని మంత్రి అన్నారు. మాకు చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ తో ఉమ్మడి సరిహద్దులు ఉన్నాయి. మేము అందరితో సత్సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటున్నామని, శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామని అన్నారు. శాంతి లేకుంటే ఆర్థికంగా ఎదగడం ఎప్పటికీ జరగదని ఖవాజా ఆసిఫ్ అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. జూన్ 20న మోడీ న్యూయార్క్ చేరుకోనున్నారు.. జూన్ 21న యూఎన్ ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహిస్తారు. భారత-అమెరిన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జూన్ 22న మోడీకి అధికారిక స్వాగత వేడుకను చూసేందుకు భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికా రాజధానికి వెళ్లనున్నారు.అదే రోజు అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి ప్రెసిడెంట్ జోబైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ వైట్ హౌజులో ఇవ్వనున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..