Nitish Kumar: ఈ నెల 20న స్టాలిన్తో నితీష్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఈ నెల 23న నితీష్ నేతృత్వంలో పాట్నాలో విపక్షాల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో సహా ఎన్సీపీ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆర్జేడీ, ఆప్ వంటి పార్టీలు హాజరుకాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 20న నితీష్ కుమార్ తమిళనాడు పర్యటకు వెళ్లనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ని కలిసేందుకు ఆయన వెళ్లనున్నారు. విపక్షాల ఐక్యత లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది.
స్టాలిన్ నుంచి అందిన ఆహ్వానం మేరకు నితీష్ కుమార్ తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 20న భేటీ తర్వాత, 21న ఆయన పాట్నాకు వెళ్లనున్నారు. జూన్ నెలలో విపక్షాల సమావేశం దేశంలో రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు నితీష్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు రాజకీయ పార్టీలో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీని సమావేశానికి వచ్చేలా ఒప్పించడంతో పాటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకుల మధ్య సయోధ్యను కుదురుస్తున్నారు.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
Read Also: Konda Murali : టెక్స్టైల్స్ పార్క్ భూసేకరణలో రైతులకు న్యాయం జరగలేదు
గతేడాది బీజేపీని కాదని సీఎం నితీష్ కుమార్ తన పార్టీ జేడీయూని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాతో 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్నాయి. అయితే బలమైన బీజేపీని, మోడీ నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే విపక్షాల ఐక్యత, విపక్షాల కూటమితోనే సాధ్యమని నితీష్ కుమార్ తో పాటు పలు విపక్ష పార్టీలు నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని క్యాబినెట్ మినిస్టర్ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్, డబ్బులకు ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. అతని అరెస్ట్ నేపథ్యంలో తమిళనాడులో పెద్ద హైడ్రామా నడిచింది. ఇదిలా ఉంటే కేంద్ర సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలతో బీజేపీ ప్రభుత్వం విపక్షాలను భయపెట్టాలని చూస్తోందని స్టాలిన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!