Green Card: ఇండియన్స్కి అమెరికా గుడ్ న్యూస్.. గ్రీన్ కార్డ్ నిబంధనల సరళీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Green Card: అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముందు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు శాశ్వతంగా అమెరికాలో స్థిరపడేందుకు జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హత నిబంధనలను సరళీకరించింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీంతో అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఒకింత లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా లబ్ధిపొందనున్నారు. గ్రీన్ కార్డుల జారీ విషయంలో అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) జారీ చేసిన గైడ్ లైన్ భారతీయులకు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఏటా కొన్ని లక్షల మంది డాలర్ డ్రీమ్స్ తో భారతీయులు అమెరికా వెళ్తున్నారు. ఇప్పుడు వారంతా తమ స్థిరనివాసాన్ని సాకారం చేసుకునేలా గ్రీన్ కార్డు నిబంధనలు సరళీకరించారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మర్గదర్శకాలు వర్తింపచేసినట్లు అమెరికా వెల్లడించింది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Wrestlers Protest: సాక్షి మాలిక్ వీడియో స్టేట్ మెంట్.. కారణమవే..!
ఉపాధి కోసం అమెరికా వెళ్లిన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు గ్రీన్ కార్డు మంజూరు చేస్తుంటారు. ప్రతీ ఏటా సుమారుగా 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. అయితే ఒక్కో దేశానికి నిర్ణీత కోటా ప్రకారమే వీటిని జారీ చేస్తుంటారు. మొత్తం దేశాల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే కేటాయించాలనేది ప్రస్తుత విధానం. ఈఏడీ అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనల సడలించిన నేపత్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మద్దతిచ్చినట్లు అవుతుందని వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాది అజయ్ భూటోరియా తెలిపారు. అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేవారి సంఖ్యను పెంపొందించేందుకు తాజా నిర్ణయం దోహదపడనుంది.
ఈ నెల 21 నుంచి భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం-వ్యాపారం, ద్వైపాక్షిక రంగాల్లో ఈ పర్యటన కీలకంగా ఉంటుందని ఇరు దేశాలు భావిస్తున్నారు. మోడీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దంపతులు, వైట్ హౌజులో విందు ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!