Uniform Civil Code: యూసీసీ వ్యతిరేకిస్తున్నాం..మా వ్యక్తిగత చట్టాలకే మేం కట్టుబడతాం.. స్పష్టం చేసి జమియత్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uniform Civil Code: కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్(UCC))ని తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2024 ఎన్నికల ముందు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యూనిఫాం సివిల్ కోడ్ పై అత్యున్నత ఇస్లామిక్ సంస్థ అయి జమియల్ చీఫ్ అర్షద్ మదానీ స్పందించారు.
యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని, అయితే దీన్ని వ్యతిరేకించేందుకు వీధుల్లోకి వెళ్లి నిరసన చెపట్టమని అర్షద్ మదానీ ఆదివారం అన్నారు. మాకు గత 1300 ఏళ్లుగా వ్యతిగత చట్టాలు ఉన్నాయి. మేము వాటికి కట్టుబడి ఉంటామని, స్వాతంత్య్రం తరువాత ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం యూసీసీ అవసరం లేదని, దీని వల్ల నిరసనలు జరుగాయని, హిందువులకు, ముస్లింలు దూరం అవుతారని తెలిపారు. దీని వల్ల కొంతమంది వ్యక్తుల దురుద్దేశ లక్ష్యం నెరవేరుతుందని మదానీ చెప్పారు.
Also Read
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
Read Also: Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మాట్లాడుతూ.. యూసీసీ అమలు చేయడం బీజేపీకి ఎన్నికల్లో గెలిచే ఒక సాధనం మాత్రమే అని అన్నారు. యూసీసీ అనవసరమైనదని, ఆచరణీయం కాదని, దేశానికి అత్యంత హానికరమైనదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పేర్కొంది. ముస్లిం వ్యక్తిగత చట్టాలు ఖురాన్, సున్నత్ నుంచి ఉద్భవించాయి, అందువల్ల ముస్లింలకు కూడా ఎటువంటి మార్పులు చేయడానికి అధికారం లేదని బోర్డు తన వైఖరిని చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు గందరగోళం, అస్తవ్యస్తతకు దారి తీస్తాయని, ఇది బుద్ది ఉన్న ప్రభుత్వం చేసే చర్య కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ అంశంపై మునపటి లా కమిషన్ 2018లో సంప్రదింపుల నివేదిక ప్రచురించిందని, అయితే తాజా సంప్రదింపుల ఎందుకు అవసరం అవుతాయో ప్రస్తుత లా కమిషన్ స్పష్టం చేయలేదని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!