Uniform Civil Code: యూసీసీ వ్యతిరేకిస్తున్నాం..మా వ్యక్తిగత చట్టాలకే మేం కట్టుబడతాం.. స్పష్టం చేసి జమియత్ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uniform Civil Code: కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫాం సివిల్ కోడ్(UCC))ని తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. 2024 ఎన్నికల ముందు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకు లా కమిషన్ సంప్రదింపులను ప్రారంభించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ యూనిఫాం సివిల్ కోడ్ పై అత్యున్నత ఇస్లామిక్ సంస్థ అయి జమియల్ చీఫ్ అర్షద్ మదానీ స్పందించారు.
యూసీసీని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమని, అయితే దీన్ని వ్యతిరేకించేందుకు వీధుల్లోకి వెళ్లి నిరసన చెపట్టమని అర్షద్ మదానీ ఆదివారం అన్నారు. మాకు గత 1300 ఏళ్లుగా వ్యతిగత చట్టాలు ఉన్నాయి. మేము వాటికి కట్టుబడి ఉంటామని, స్వాతంత్య్రం తరువాత ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం యూసీసీ అవసరం లేదని, దీని వల్ల నిరసనలు జరుగాయని, హిందువులకు, ముస్లింలు దూరం అవుతారని తెలిపారు. దీని వల్ల కొంతమంది వ్యక్తుల దురుద్దేశ లక్ష్యం నెరవేరుతుందని మదానీ చెప్పారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
Read Also: Pakistan: ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు..
ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మాట్లాడుతూ.. యూసీసీ అమలు చేయడం బీజేపీకి ఎన్నికల్లో గెలిచే ఒక సాధనం మాత్రమే అని అన్నారు. యూసీసీ అనవసరమైనదని, ఆచరణీయం కాదని, దేశానికి అత్యంత హానికరమైనదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పేర్కొంది. ముస్లిం వ్యక్తిగత చట్టాలు ఖురాన్, సున్నత్ నుంచి ఉద్భవించాయి, అందువల్ల ముస్లింలకు కూడా ఎటువంటి మార్పులు చేయడానికి అధికారం లేదని బోర్డు తన వైఖరిని చెబుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చే చట్టాలు గందరగోళం, అస్తవ్యస్తతకు దారి తీస్తాయని, ఇది బుద్ది ఉన్న ప్రభుత్వం చేసే చర్య కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ అంశంపై మునపటి లా కమిషన్ 2018లో సంప్రదింపుల నివేదిక ప్రచురించిందని, అయితే తాజా సంప్రదింపుల ఎందుకు అవసరం అవుతాయో ప్రస్తుత లా కమిషన్ స్పష్టం చేయలేదని అన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!