Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
- మేడారం జాతర ప్రాంగణానికి నూతన రూపు
- రూ.25.5 కోట్లతో అభివృద్ధి పనులు
- గ్రానైట్ ప్రాకారం, గద్దెల విస్తరణ
- 2026 మహాజాతరకు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jathara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. 2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.
Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..
Also Read
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు , ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా, వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించడమే కాకుండా, పూర్తిగా కృష్ణశిల (గ్రానైట్) రాళ్లతో అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం సుమారు 4,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగిస్తుండటం గమనార్హం. ప్రతి గద్దెకు ఎనిమిది పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెల ఆధునీకీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దలను కూడా ప్రభుత్వం ఆధునికీకరించి కొత్త రూపునిస్తోంది.
ఈ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆలయం చుట్టూ నిర్మించిన రాతి గోడలపై ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. 7,000కు పైగా చిత్రాల ద్వారా గిరిజనుల పుట్టుపూర్వోత్తరాలు, వారి జీవనశైలి , వనదేవతల చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు సాధారణ గుడిసెల్లో కొలువైన తల్లులు, ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడేలా కళ్లు చెదిరే కళాకృతులతో కూడిన రాతి మందిరాల్లో కొలువుదీరబోతున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖల ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మేడారంను ఆధ్యాత్మికంగా , పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నూతన హంగులతో 2026 మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
Op Sindoor 2.0: పాకిస్తాన్లో భయం భయం.. సరిహద్దులకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్..
తాజావార్తలు
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
-
IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!