Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
- మేడారం జాతర ప్రాంగణానికి నూతన రూపు
- రూ.25.5 కోట్లతో అభివృద్ధి పనులు
- గ్రానైట్ ప్రాకారం, గద్దెల విస్తరణ
- 2026 మహాజాతరకు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jathara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. 2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.
Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు , ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా, వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించడమే కాకుండా, పూర్తిగా కృష్ణశిల (గ్రానైట్) రాళ్లతో అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం సుమారు 4,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగిస్తుండటం గమనార్హం. ప్రతి గద్దెకు ఎనిమిది పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెల ఆధునీకీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దలను కూడా ప్రభుత్వం ఆధునికీకరించి కొత్త రూపునిస్తోంది.
ఈ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆలయం చుట్టూ నిర్మించిన రాతి గోడలపై ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. 7,000కు పైగా చిత్రాల ద్వారా గిరిజనుల పుట్టుపూర్వోత్తరాలు, వారి జీవనశైలి , వనదేవతల చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు సాధారణ గుడిసెల్లో కొలువైన తల్లులు, ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడేలా కళ్లు చెదిరే కళాకృతులతో కూడిన రాతి మందిరాల్లో కొలువుదీరబోతున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖల ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మేడారంను ఆధ్యాత్మికంగా , పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నూతన హంగులతో 2026 మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
Op Sindoor 2.0: పాకిస్తాన్లో భయం భయం.. సరిహద్దులకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!