Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
- మేడారం జాతర ప్రాంగణానికి నూతన రూపు
- రూ.25.5 కోట్లతో అభివృద్ధి పనులు
- గ్రానైట్ ప్రాకారం, గద్దెల విస్తరణ
- 2026 మహాజాతరకు సర్వం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jathara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ వనదేవతల జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. సుమారు 25.5 కోట్ల రూపాయల భారీ నిధులతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను అధికారులు అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. 2026లో జరగబోయే మహాజాతర నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.
Shambala Day 1 Collection: రికార్డులు క్రియేట్ చేసిన ఆది సాయి కుమార్ ‘శంబాల’..
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు , ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా, వనదేవతల పూజారుల సూచనల మేరకే ఈ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించడమే కాకుండా, పూర్తిగా కృష్ణశిల (గ్రానైట్) రాళ్లతో అద్భుతమైన ప్రాకారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాల కోసం సుమారు 4,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగిస్తుండటం గమనార్హం. ప్రతి గద్దెకు ఎనిమిది పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి పిల్లర్లతో గద్దెల ఆధునీకీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దలను కూడా ప్రభుత్వం ఆధునికీకరించి కొత్త రూపునిస్తోంది.
ఈ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆలయం చుట్టూ నిర్మించిన రాతి గోడలపై ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. 7,000కు పైగా చిత్రాల ద్వారా గిరిజనుల పుట్టుపూర్వోత్తరాలు, వారి జీవనశైలి , వనదేవతల చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు సాధారణ గుడిసెల్లో కొలువైన తల్లులు, ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడేలా కళ్లు చెదిరే కళాకృతులతో కూడిన రాతి మందిరాల్లో కొలువుదీరబోతున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖల ప్రత్యేక చొరవతో ప్రభుత్వం మేడారంను ఆధ్యాత్మికంగా , పర్యాటక పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నూతన హంగులతో 2026 మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.
Op Sindoor 2.0: పాకిస్తాన్లో భయం భయం.. సరిహద్దులకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్..
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!