Law Commission: దేశ భద్రత, సమగ్రతకు “దేశద్రోహ చట్టం” కీలక సాధనం.. కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Law Commission: గత కొంత కాలంగా దేశద్రోహ చట్టం(sedition) చట్టం తొలగింపు, అమలుపై కీలక చర్చ జరుగుతోంది. దేహ్రద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ నుంచి కేరళ, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత, సమగ్రతను రక్షించేందుకు దేశద్రోహ చట్టం కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు.
దేశద్రోహ చట్టాన్ని పునరుద్ధరించాలని ఇటీవల లా కమిషన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. దీన్ని జస్టిస్ రితురాజ్ అవస్థి సమర్థించారు. అయితే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా పలు రక్షణలు తీసుకోవాలని ఆయన కోరారు. గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఉపసంహరణలో ఉన్న చట్టాన్ని నిలుపుదల చేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
Read Also: Mamata Banerjee: బీజేపీ అధికారంలో ఉండేది మరో 6 నెలలే.. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు..
దేశ భద్రత చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) వంటి చట్టాలు ఉన్నప్పటికీ.. భిన్న పరిస్థితుల దృష్ట్యా దేశద్రోహ చట్టం కూడా అవసరమని అన్నారు. వలసవాద చట్టం అని దీన్ని తొలగించడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా అనేక దేశాలు ఏదో రూపంలో ఇలాంటి సొంత చట్టాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
గత నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో, జస్టిస్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్, భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 124A దుర్వినియోగాన్ని నిరోధించడానికి భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు దీన్ని కొనసాగించాలని సిఫారసు చేసింది. అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్నందున అధికార పార్టీ వ్యతిరేకంగా ఉన్న గొంతుల్ని అణిచివేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దోశద్రోహ చట్టం ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష, జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జీవితఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది. జరిమానాతో లేదా లేకుండా మూడేళ్ల వరకు ఉన్న ఈ శిక్షను జరిమానాతో లేదా లేకుండా ఏడేళ్లకు పెంచవచ్చు సిఫారసు చేశామని అవస్థి వివరించారు.
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?