Mamata Banerjee: బీజేపీ అధికారంలో ఉండేది మరో 6 నెలలే.. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయని.. బీజేపీ ప్రభుత్వం మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 8న పశ్చిమ బెంగాల్ లో జరగే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. జల్పైగురి జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. రేపు బీజేపీ అధికారంలో ఉండకపోవచ్చని.. కాబట్టి బీఎస్ఎఫ్ బలాలు నిష్ఫక్షపాతంగా పనిచేయాలని ఆమె అన్నారు. ఇప్పటికే బీజేపీ ఓటమిని పసిగట్టి వివిధ గ్రాపులు, వర్గాలతో లాబీయింగ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.
మైనారిటీలను, దళితులను కొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే ప్రస్తుతం వారితేనే ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో ఎంతో శ్రద్ధ చూపుతున్నామని చెప్పడానికి వారితో ఫోటోలు దిగుతున్నారని.. ఎక్కువ మంది వ్యాపారులు, పేదలు, అణగారిన వర్గాలను గురించి పట్టించుకోని ముస్లింలను బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీదీ ఇక్కడ ఉన్నంత వరకు మైనారిటీలు ఇక్కడ సురక్షితంగా ఉంటారని ఆమె అన్నారు.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
Read Also: Eid al-Adha 2023: భారత్లోని ప్రసిద్ధ మసీదుల గురించి మీకు తెలుసా?
ఇటీవల బీఎస్ఎఫ్ కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాల్లో ఒకరికి హోంగార్డుగా ఉద్యోగం ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. బీఎస్ఎప్ అధికారులు అందరిపై నేను ఆరోపణలు చేయడం లేదని..వారు మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నారని.. అయితే రేపు బీజేపీ అధికారంలో ఉండకపోవచ్చని.. బీఎస్ఎఫ్ తమ పనిచేస్తూనే ఉండాలని.. వారు నిష్ఫాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. గతేడాది సరిహద్దుల్లో స్మగ్లర్లుగా పేర్కొంటూ బీఎస్ఎప్ గ్రామస్తులను కాల్చి చంపిన విషయాన్ని మమత ప్రస్తావించారు. బీజేపీ తరుపున బీఎస్ఎఫ్ సరిహద్దుల్లోని ఓటర్లను బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసేందుకు సీపీఎం, కాంగ్రెస్ పాత్ర ఉందని అన్నారు. మేము పాన్ ఇండియా స్థాయిలో పొత్తు పెట్టుకోవచ్చు.. కానీ బెంగాల్ లో బీజేపీ-సీపీఎం-కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వారు ఓడిపోతారని ఆమె అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీని గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. గ్రామస్థాయిలో అవినీతిని సున్నాకు చేరుస్తామని ఆమె ప్రకటించారు. ఎవరైనా డబ్బులు అడిగితే నేనుగా నాకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జూలై 8న బెంగాల్ లోని జిల్లా పరిషత్, పంచాయతీ సమితి, గ్రామపంచాతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 75,000 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు. 5.67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!