DK Shivakumar: “సిద్ధరామయ్య భయపడ్డారు..అదే నేనైతే”.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజారిటీతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రాజెక్టును కొనసాగించడానికి భయపడ్డాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వంలో దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యుడు, కర్ణాటక ప్రజలకు ఆరాధకుడు అయిన కెంపెగౌడ-1 జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీని ఉద్దేశించి శివకుమార్ మాట్లాడుతూ, సొరంగాలు మరియు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం తనకు చాలా అభ్యర్థనలు అందుతున్నాయని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టులను అమలు చేయడంతో ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. 2017లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా.. బెంగళూర్ నగరాభివృద్ధి మంత్రిగా ఉన్న కేజే జార్జ్ నగరంలో ఓ స్టీల్ ఫ్లై ఓవర్ కు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసనలకు భయపడ్డారని వ్యాఖ్యానించారు. అదే నేనైతే నిరసనలకు లొంగిపోయే వాడిని కాదని.. ప్రాజెక్టు పూర్తి చేసేవాడినని అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Minister Jogi Ramesh: పేదల పక్షాన నిలిచే సీఎం జగన్ జోలికి వస్తే.. పెత్తాందార్ల సంగతి తేలుస్తాం..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా ఆశించారు. చాలా రోజులు అధిష్టానం చర్చల తర్వాత సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి, శివకుమార్ కు డిఫ్యూటీ సీఎంగా పదవులను ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి మధ్య పొసగడం లేదంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం కొన్ని రోజుల్లో కుమ్ములాటల్లో కూలిపోతుందని జోక్యం చెబుతున్నారు బీజేపీ నాయకులు.
సిద్ధరామయ్యపై డీకే శివకుమార్ వ్యాఖ్యలపై మంత్రి ప్రియాంక్ ఖర్గేని ప్రశ్నించగా.. ‘‘సిద్ధరామయ్య భయపడిపోయారని నేను చెప్పను. ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయానికి సున్నితంగా ఉంటారు. కొన్నిసార్లు తప్పుడు కథనాలు వెలువడి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఉపముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఇదే’’ ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!