Srilanka: భారత్కు వ్యతిరేకంగా మా భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srilanka: చైనాతో తమకు ఎలాంటి సైనిక ఒప్పందాలు లేవని శ్రీలంక తటస్థంగా ఉంటుందని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అన్నారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశానికి వ్యతిరేఖంగా ఎప్పటికీ వాడుకోనివ్వం అని ఆయన స్పష్టం చేశారు. ఒక టెలివిజన్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో చైనా సైన్యం ఉందనే ఆరోపణల్ని కొట్టిపారేశారు. తాము తటస్థంగా ఉంటామని తెలిపారు. యూకే, ఫ్రాన్స్ లో అధికారికంగా పర్యటిస్తున్న విక్రమసింఘే, ఫ్రాన్స్ ప్రభుత్వ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: World Bank: ఛత్తీస్గఢ్ పాఠశాలల కోసం ప్రపంచ బ్యాంకు భారీ రుణం
Also Read
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
తమది తటస్థ దేశమని, అయితే భారత్ పై ఎలాంటి బెదిరింపులకు శ్రీలంకను స్థావరంగా ఉపయోగించుకోవడాన్ని మేం అనుమతించమని ఆయన అన్నారు. తమ దేశంలో చైనీయులు కొన్ని శతాబ్ధాలుగా ఉంటున్నారని.. అయితే చైనా సైనిక ఉనికి లేదని, హంబన్టోటాలో చైనా ఉనికి గురించి వచ్చిన నివేదికలను కేవలం ఊహాగానాలు అని పేర్కొన్నారు. హంబన్తోట నౌకాశ్రయాన్ని చైనా వ్యాపారులకు ఇచ్చినప్పటికీ, దాని భద్రత శ్రీలంక ప్రభుత్వమే నియంత్రిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సదరన్ నావల్ కమాండ్ హంబన్ టోటకు మార్చబడుతుందని వెల్లడించారు.
గతేడాది సైనిక నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్ టోట నౌకాశ్రయంలోకి వచ్చింది. ఇది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ, ఉపగ్రహ ట్రాకింగ్ షిప్. ఆ సమయంలో భారత్ పై నిఘా పెట్టేందుకే ఇది హంబన్ టోటకు వచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. ముందుగా యువాన్ వాంగ్ -5 అనుమతి ఇచ్చేందుకు శ్రీలంక అభ్యంతరం చెప్పినా.. చైనా ఒత్తిడితో డాకింగ్ కు అనుమతి ఇచ్చింది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రం భారత్ కు అత్యంత కీలకం. అయితే ఈ ప్రాంతంలో చైనా తన ఆధిక్యతను పెంచుకోవాలని చూస్తోంది. అంతకుముందు శ్రీలంక 2014లో చైనా అణు జలంతర్గామిని తన ఓడ రేవులో డాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఇండియా-శ్రీలంకల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!