MEA: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలను ఖండించిన భారత్..
- బంగ్లాదేశ్లో హిందువుల హత్యల్ని ఖండించిన భారత్..
- బాధితులకు న్యాయం చేయాలని, నిందితుల్ని శిక్షించాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MEA: బంగ్లాదేశ్లోని మతోన్మాద మూక హిందువుల్ని టార్గెట్ చేసి, చంపేస్తోంది. మైమన్సింగ్లో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని దైవదూషణ ఆరోపణలతో మూకదాడికి పాల్పడి హతమార్చారు. అతడి శరీరాన్ని రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి, కాల్చి చంపారు. ఈ ఘటన భారతదేశంతో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీని తర్వాత, రాజ్బరి జిల్లాలో మరో హిందూ వ్యక్తి అమృత్ మండల్ అనే వ్యక్తిని చంపేశారు.
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తుల హత్యల్ని భారత్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. పొరుగుదేశం దాడుల్ని మైనారిటీలపై ‘‘నిరంతర శత్రుత్వం’’గా అభివర్ణించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల హత్యలతో న్యూఢిల్లీ కలవరపడిందని, బాధ్యులను జవాబుదారీగా ఉంచాలని, MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. “బంగ్లాదేశ్లో మైనారిటీలపై నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయం. ఇటీవల బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుడి హత్యను మేము ఖండిస్తున్నాము, నేరస్థులను శిక్ష పడాలని ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.
“మైమెన్సింగ్లో ఇటీవల ఒక హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని మేము ఖండిస్తున్నాము మరియు ఈ నేరానికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతారని ఆశిస్తున్నాము. తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హత్యలు, దహనకాండలు,భూకబ్జాలతో సహా మైనారిటీలపై 2,900కు పైగా హింసాత్మక సంఘటనలు జరిగినట్లు స్వతంత్ర వర్గాలు నమోదు చేశాయి. ఈ సంఘటనలను కేవలం మీడియా అతిశయోక్తులుగా లేదా రాజకీయ హింసగా కొట్టిపారేయలేము,” అని ఆయన చెప్పారు.
#WATCH | Delhi | On Bangladesh, MEA Spox Randhir Jaiswal says," The unremitting hostility against minorities in Bangladesh is a matter of great concern. We condemn the recent killing of a Hindu youth in Bangladesh and expect that the perpetrators of the crime will be brought to… pic.twitter.com/UbacgqSskh
— ANI (@ANI) December 26, 2025
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..