Venu Goapl Reddy
Author- NTV Telugu-
Qatar: ఖతార్లో మాజీ నావీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ దాఖలు చేసిన భారత్..
Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది. -
Amazon: లాభాలు వస్తున్న అమెజాన్లో ఉద్యోగుల కోతలు ఆగడం లేదు..
Amazon: ఆర్థికమాంద్యం భయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు టెక్ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఖర్చలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గతేడాది నవంబర్ నుంచి మొదలైన ఉద్యోగుల తొలగింపు పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. -
Jay Kotak: మాజీ మిస్ ఇండియాను పెళ్లాడిన బిలియనీర్..
Jay Kotak: ప్రముఖ బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ మాజీ మిస్ ఇండియా అదితి ఆర్యను వివాహం చేసుకున్నాడు. మంగళవారం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అదితి ఆర్య యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్న సమయంలో జై ఆమెను అభినందిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా కాబోయే భార్య అదితి ఈ రోజు యేల్ యూనివర్సిటీలో తన ఎంబీఏ పూర్తి చేసింది. మీ గురించి చాలా గర్వంగా… -
Mahua Moitra: పార్లమెంట్ నుంచి మహువా మోయిత్రా బహిష్కరణ.. 6:4 తీర్పుతో ప్యానెల్ ఆమోదం..
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఆమెపై విచారణ జరిపింది. అంతకుముందు మహువా మోయిత్రాపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేను కూడా విచారించింది. -
Smartwatch Saves Life: జాగింగ్ చేస్తుండగా గుండెపోటు.. సీఈఓ ప్రాణాలు కాపాడిన స్మార్ట్వాచ్
Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది. -
Israel-Hamas War: ఇజ్రాయిల్పై హమాస్ దాడి గురించి గాజా జర్నలిస్టులకు ముందే తెలుసా..?
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ భీకరంగా సాగుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం గాజాను చుట్టుముట్టింది. భూతల దాడులు చేస్తోంది. ఉత్తరగాజాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమైంది. దీంతో పాటు హమాస్ టన్నెల్ నెట్వర్క్తో పాటు హమాస్ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులను ముమ్మరం చేసింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని దారుణంగా చంపేశారు. 200 మందిని బందీలుగా పట్టుకున్నారు. -
PM Modi: కాంగ్రెస్ వస్తే విధ్వంసమే.. ఎంపీలో ప్రధాని విమర్శలు..
PM Modi: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సత్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దానితో పాటు విధ్వంసాన్ని తెస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్కి రోడ్మ్యాప్ లేదని, మోడీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. -
Bihar: 50 నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ..
Bihar: సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కార్ కీలక రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బీహార్లోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రంలోని ఇతర వెనకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోటాను పెంచే బిల్లుకు మంగళవారం బీహార్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. -
CM Nitish Kumar: నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ధ్వజం.. నేనే భారతీయురాలినై ఉంటే..
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు. -
Mahua Moitra: మహువాను “లోక్సభ నుంచి తక్షణమే బహిష్కరించాలి”.. ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ రిపోర్ట్ రెడీ..
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!