Arvind Kejriwal: బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటోంది.. లిక్కర్ స్కామ్పై కేజ్రీవాల్ సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని, తనను లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే అని చెప్పారు. దర్యాప్తును సాకుగా చెప్పి తనను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
రెండేళ్లుగా బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి పలువురిని అరెస్ట్ చేసిందని, ఈ స్కామ్లో ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదని, స్కామ్ జరిగితే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని, గాలిలో మాయమైందా..? అంటూ ప్రశ్నించారు. నిజం ఏంటంటే అసలు స్కామే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో గుండాయిజం పెరిగిందని, ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేస్తోందని ఆరోపించారు. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, దీనిపై ఈడీకి లేఖ రాస్తూ ఎలా చట్టవిరుద్ధమో వివరించాలని, వారి నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల ముందే తనకు ఎందుకు సమన్లు పంపారని ప్రశ్నించారు. 8 నెలల క్రితం సీబీఐ పిలిచినప్పుడు వెళ్లానని, అయితే ఇప్పుడే తనను ఎందుకు విచారణ పేరుతో పిలుస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు కేజ్రీవాల్కి ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. మూడుసార్లు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆప్ లోని కీలక నేతల్లో భయాందోళన మొదలైంది. అయితే అలాంటిదేం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో నాలుగో సారి సమన్లను జారీ చేసేందుకు ఈడీ మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఈడీ విచారణతో పిలిచి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కూడా ఇలాగే జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
#WATCH | On ED summons in liquor police case, Delhi CM & AAP leader Arvind Kejriwal says, "The truth is that there was no corruption. BJP wants to arrest me. My biggest asset is my honesty & they want to dent it. My lawyers have told me that summons sent to me are illegal. BJP's… pic.twitter.com/jLWmkZ2mxj
— ANI (@ANI) January 4, 2024
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!