Arvind Kejriwal: బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటోంది.. లిక్కర్ స్కామ్పై కేజ్రీవాల్ సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని, తనను లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే అని చెప్పారు. దర్యాప్తును సాకుగా చెప్పి తనను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
రెండేళ్లుగా బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి పలువురిని అరెస్ట్ చేసిందని, ఈ స్కామ్లో ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదని, స్కామ్ జరిగితే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని, గాలిలో మాయమైందా..? అంటూ ప్రశ్నించారు. నిజం ఏంటంటే అసలు స్కామే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో గుండాయిజం పెరిగిందని, ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేస్తోందని ఆరోపించారు. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, దీనిపై ఈడీకి లేఖ రాస్తూ ఎలా చట్టవిరుద్ధమో వివరించాలని, వారి నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల ముందే తనకు ఎందుకు సమన్లు పంపారని ప్రశ్నించారు. 8 నెలల క్రితం సీబీఐ పిలిచినప్పుడు వెళ్లానని, అయితే ఇప్పుడే తనను ఎందుకు విచారణ పేరుతో పిలుస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు కేజ్రీవాల్కి ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. మూడుసార్లు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆప్ లోని కీలక నేతల్లో భయాందోళన మొదలైంది. అయితే అలాంటిదేం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో నాలుగో సారి సమన్లను జారీ చేసేందుకు ఈడీ మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఈడీ విచారణతో పిలిచి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కూడా ఇలాగే జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
#WATCH | On ED summons in liquor police case, Delhi CM & AAP leader Arvind Kejriwal says, "The truth is that there was no corruption. BJP wants to arrest me. My biggest asset is my honesty & they want to dent it. My lawyers have told me that summons sent to me are illegal. BJP's… pic.twitter.com/jLWmkZ2mxj
— ANI (@ANI) January 4, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!