Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇదిలా ఉంటే నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. ఇది సున్నితమైన విషయమని దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీం తెలిపింది. తాము అంతర్జాతీయ చట్టాల్లో జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని కోర్టు తెలిపింది.
Also Read
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
Read Also: Covid Cases In India: భారత్లో 4000కి పైగా యాక్టివ్ కేసులు.. ఇద్దరు మృతి..
ఢిల్లీకి చెందిన నిఖిల్ గుప్తాను 2023లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. సిక్కు వేర్పాటువాద నేత, భారతదేశం చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని, ఇందులో మరో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా అభియోగాలు మోపింది. ఒక అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న పన్నూని అమెరికా గడ్డపై చంపాలని కుట్ర పన్నాడనే విషయాన్ని యూఎస్ సీరియస్గా తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసును విచారించేందు భారత్ అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. నిఖిల్ గుప్తా, పన్నూను చంపేందుకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బులు చెల్లించడానే ఆరోపణలు ఉన్నాయి.
నిఖిల్ గుప్తా గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ.. గుప్తాను చెక్ అధికారులు నిర్భందించారని బీఫ్, పంది మాంసం తినాల్సి వస్తుందని, తప్పుడు కేసులో ఇరుక్కున్నాడని, అతడికి సాయం చేసేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అతని కుటుంబీకులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!