Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇదిలా ఉంటే నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. ఇది సున్నితమైన విషయమని దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని సుప్రీం తెలిపింది. తాము అంతర్జాతీయ చట్టాల్లో జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్టు అధికార పరిధిని గౌరవించాలని కోర్టు తెలిపింది.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
Read Also: Covid Cases In India: భారత్లో 4000కి పైగా యాక్టివ్ కేసులు.. ఇద్దరు మృతి..
ఢిల్లీకి చెందిన నిఖిల్ గుప్తాను 2023లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. సిక్కు వేర్పాటువాద నేత, భారతదేశం చేత ఉగ్రవాదిగా గుర్తించబడిన గురుపత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నాడని, ఇందులో మరో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా అభియోగాలు మోపింది. ఒక అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్న పన్నూని అమెరికా గడ్డపై చంపాలని కుట్ర పన్నాడనే విషయాన్ని యూఎస్ సీరియస్గా తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసును విచారించేందు భారత్ అత్యున్నత స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. నిఖిల్ గుప్తా, పన్నూను చంపేందుకు ఓ కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బులు చెల్లించడానే ఆరోపణలు ఉన్నాయి.
నిఖిల్ గుప్తా గత నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ.. గుప్తాను చెక్ అధికారులు నిర్భందించారని బీఫ్, పంది మాంసం తినాల్సి వస్తుందని, తప్పుడు కేసులో ఇరుక్కున్నాడని, అతడికి సాయం చేసేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అతని కుటుంబీకులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!