Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fuel Prices: గత కొంత కాలంగా కేంద్రం పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గిస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిన్నింటిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతమైతే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ప్రతిపాదన లేదని ప్రభుత్వం బుధవారం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో అస్థిరత ఎక్కువగా ఉన్నందు వల్ల ప్రస్తుతం కేంద్రానికి అలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఇంధన ధరల తగ్గింపుపై మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టిపారేశారు. ఇంధన లభ్యత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
Read Also: NCP: “రాముడు శాఖాహరి కాదు మాంసం తినేవాడు”.. ఎన్సీపీ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఇటీవల క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ భారీ నష్టాలను చవిచూశాయని, ఇంధన ధరల తగ్గింపుపై చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు లేవని చెప్పారు. ధరల పరిస్థితిని సమీక్షిస్తూ తాము స్థిరంగా, సానుకూలంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇటీవలి నెలల్లో ఇంధన ధరలు తగ్గిన ఏకైక దేశం భారత్ అని ఆయన చెప్పారు. దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్, డిజిల్ ధరలు దాదాపుగా 40-80 శాతం పెరిగాయని, ఇతర పాశ్చాత్య దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, కానీ భారత్లో మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. నవంబర్ 2021, మే 2022లో రెండు సందర్భాలలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించిందని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!