Venu Goapl Reddy
Author- NTV Telugu-
Manipur: మణిపూర్లో కీలక పరిణామం.. కేంద్రంతో తిరుగుబాటు గ్రూపు UNLF శాంతి ఒప్పందం
Manipur: గత కొంత కాలంగా జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. రాష్ట్రంలో మైయిటీ, కుకీల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారుగా 200 మంది వరకు మరణించగా.. చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF), కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు. -
India-Pakistan: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లిన అంజూ.. తిరిగి ఇండియాకు వచ్చింది..
India-Pakistan: ఈ ఏడాడి జూలై నెలలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజూ అనే 34 ఏళ్ల యువతి తన ఫేస్బుక్ ఫ్రెండ్ని కలుసుకునేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఆ సమయంలో ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్లోనే తన స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంజూ ఇస్లాంలోకి మారినట్లు పాక్ మీడియా వెళ్లడించింది. అప్పటి నుంచి ఈ జంట పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివాసం ఉంటున్నారు. -
Covid-19 Vaccine: కోవిడ్ కారణంగా పెరిగిన అకాల జననాలు.. ప్రమాదాన్ని తగ్గించిన కోవిడ్ వ్యాక్సిన్లు..
Covid-19 Vaccine: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచదేశాలను కలవరపెట్టింది. చైనాలో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ అనతికాలంలోనే ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది. లక్షల్లో ప్రజలు మరణించారు. రూపాలను మార్చుకుంటూ కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై దాడి చేసింది. చైనాతో పాటు అమెరికా, ఇటలీ, భారత్ వంటి దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. దీన్ని అంతం చేయడానికి ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్లను తయారుచేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి నుంచి ప్రపంచదేశాలు కోలుకుంటున్నాయి. -
Elon Musk: ఎలాన్ మస్క్ గాజాను సందర్శించాలి.. ఆహ్వానించిన హమాస్..
Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్కి అరుదైన ఆహ్వానం అందింది. హమాస్ ఉగ్రసంస్థ మస్క్ని గాజా సందర్శించాల్సిందిగా ఆహ్వానించింది. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయిల్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ పర్యటన తర్వాత గాజాను సందర్శించాలని హమాస్ సీనియర్ అధికారి మంగళవారం మస్క్కి ఆహ్వానం పలికారు. -
Gurpatwant Singh Pannun: “ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హత్యకు కుట్ర”.. అమెరికా ఆరోపణలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసిన భారత్..
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్రపన్నిందని, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. అమెరికా గడ్డపై అమెరికా పౌరుడిని హత్య చేసే కుట్రను ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వైట్హౌజ్ ప్రతినిధి మాట్లాడుతూ.. భారత్కి అత్యున్నత స్థాయిలో తమ ఆందోళన చేశామని, దీనికి బాధ్యులు బాధ్యత వహించాలని అమెరికా ఇండియాను హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం కాదని భారత్ అమెరికాకు సమాధానం ఇచ్చింది. -
CAA: సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు.. స్పష్టం చేసిన అమిత్ షా..
CAA: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం( సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)(సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసకు పాల్పడుతోందిన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. -
USA: ఇతర మహిళల్ని చూస్తున్నాడని.. బాయ్ఫ్రెండ్ కంటిని పొడిచేసిన ప్రేయసి..
USA: అమెరికాలో ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ అతని బాయ్ఫ్రెండ్ కంటిని నీడిల్స్తో పొడిచింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఆరోపిస్తూ.. సదరు మహిళ అతని కంటిలో రేబిస్ సూదితో పొడించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. -
Chennai-Pune Train: చెన్నై-పూణే ట్రైన్లో కలుషిత ఆహారం.. 40 మంది ప్రయాణికులకు అస్వస్థత..
Chennai-Pune Train: చెన్నై నుంచి పూణే వెళ్తున్న భారత్ గౌరవ్ ట్రైన్లో కలుషిత ఆహారం అందించినట్లు తెలుస్తోంది. ట్రైన్లో కలుషిత ఆహారం తిన్న 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ అయింది. రైల్వే మంత్రిత్వశాఖలోని కొన్ని వర్గాల సమచారం మేరకు ఓ -
Pakistan: పాక్ ఆర్థిక సంక్షోభం.. 20-25 బిలియన్ డాలర్లు పెట్టేందుకు యూఏఈ సిద్ధం..
Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. -
China: చైనా వింత నిర్ణయం.. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఆస్పత్రిలోనే ‘ హోమ్ వర్క్ జోన్స్’
China: చైనాలో మిస్టరీ వ్యాధి ప్రబలుతోంది. న్యూమోనియాతో అక్కడి పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వ్యాధి విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. అయితే సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులే అని చైనా ప్రభుత్వం చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!