BJP-JDS alliance: కొత్త రాజకీయ సమీకరణం.. పొత్తు దిశగా బీజేపీ, జేడీఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP-JDS alliance: కర్ణాటకలో కొత్త రాజకీయ సమీకరణం తెరపైకి వచ్చింది. పాత మిత్రుడు జేడీఎస్, బీజేపీ పంచన చేరబోతోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ దారుణం దెబ్బతింది. బీజేపీ ఓట్ షేర్ అలాగే ఉన్నా.. జేడీఎస్ ఓట్ షేర్ దారుణంగా పడిపోయింది. జేడీఎస్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లడం ఆ పార్టీకి ప్రమాదఘంటికలు మోగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు పార్టీలు కర్ణాటకలో ఓట్లు చీలకుండా మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలను ప్రధాని మోడీ నిర్ణయిస్తారని తెలుస్తోంది.
Read Also: G20 Summit: జీ20 సదస్సుకు ఏ దేశాధ్యక్షులు వస్తున్నారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారంటే ?
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
ఈ మేరకు ఇప్పటికే జనతాదళ్ (సెక్యులర్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల బీజేపీ అమిత్ షా, జేపీ నడ్డాలను కలిశారని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఐదు లోక్సభ స్థానాలను కోరారని తెలిసింది. మాండ్య, హాసన్, తుమకూరు, చిక్బల్లాపూర్, బెంగళూరు రూరల్ ఎంపీ స్థానాలను జేడీఎస్ అడుగున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తు ఉండదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ పలుమార్లు ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో పొత్తు చాలా అవసరం అని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ సందర్భంలో పలు విపక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా.. దేవెగౌడ హాజరుకావడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ముఖ్యంగా కింగ్ మేకర్ పొజిషన్ లో ఉండే జేడీఎస్ దారుణంగా దెబ్బతింది. ఆ పార్టీకి పట్టున్న మైసూర్ రీజియన్ లో కూడా చాలా స్థానాల్లో ఓడిపోయింది. చివరకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఓడిపోయారు. ప్రస్తుతం జేడీఎస్ కి 19 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటక చాలా కీలకం. మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో గెలిచారు. జేడీ(ఎస్) కంచుకోట హాసన్లో దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ విజయం సాధించారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..