Yogi Adityanath: రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. “సనాతన” వ్యాఖ్యలపై యోగి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ వివాదం ఇప్పడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఆయన్ను హిట్లర్ తో పోల్చింది. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి హిందూమతాన్ని ద్వేషిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది.
Read Also: G20 Summit: 15కు పైగా దేశాధినేతలతో పీఎం మోడీ ద్వైపాక్షిక సమావేశాలు
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మంపై గతంలో కూడా అనేక దాడులు జరిగాయని, ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాని, ఈ రోజు కూడా పరాన్నజీవులతో ఎలాంటి హాని జరగదని అన్నారు. రావణుడి అహంకారం, కంసుడి గర్జన సనాతనాన్ని తుడిచేయలేకపోయాయని, బాబర్, ఔరంగజేబు దురాగతాలు కూడా సనాతనాన్ని ఏం చేయలేకపోయాయని, ఈ చిల్లర శక్తులు, పరాన్నజీవులు ఏం చేస్తాయని వ్యాఖ్యానించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోలీస్ లైన్స్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగి, ఉదయనిధి వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శించడం మానవాళిని ఇబ్బందుల్లోకి నెట్టే ఉరుద్దేశంతో కూడుకున్నవని అన్నారు. సనాతన ధర్మాన్ని సూర్యుడి శక్తితో అభివర్ణించారు. సనాతనాన్ని విమర్శించడం సూర్యుడిపై ఉమ్మేయడమే అని, అది తిరిగి వారి ముఖంపై పడుతుందని యోగి చెప్పారు. ఇలాంటి వారి చేష్టల వల్ల భావి తరాలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని, భారతదేశ సంప్రదాయాల పట్ల గర్వపడాలని అన్నారు. దేవుడిని నాశనం చేయాలని అనుకున్నవాళ్లంతా నాశనమై పోయారని గుర్తు చేశారు. అంతకుముందు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, మలేరియా, డెంగ్యూలతో పోల్చారు.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!