Yogi Adityanath: రావణుడు, కంసుడి వల్లే కాలేదు.. “సనాతన” వ్యాఖ్యలపై యోగి కామెంట్స్..
Yogi Adityanath: డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ వివాదం ఇప్పడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేస్తూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఆయన్ను హిట్లర్ తో పోల్చింది. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి హిందూమతాన్ని ద్వేషిస్తున్నాయని బీజేపీ విమర్శిస్తోంది.
Read Also: G20 Summit: 15కు పైగా దేశాధినేతలతో పీఎం మోడీ ద్వైపాక్షిక సమావేశాలు
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మంపై గతంలో కూడా అనేక దాడులు జరిగాయని, ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాని, ఈ రోజు కూడా పరాన్నజీవులతో ఎలాంటి హాని జరగదని అన్నారు. రావణుడి అహంకారం, కంసుడి గర్జన సనాతనాన్ని తుడిచేయలేకపోయాయని, బాబర్, ఔరంగజేబు దురాగతాలు కూడా సనాతనాన్ని ఏం చేయలేకపోయాయని, ఈ చిల్లర శక్తులు, పరాన్నజీవులు ఏం చేస్తాయని వ్యాఖ్యానించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోలీస్ లైన్స్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగి, ఉదయనిధి వ్యాఖ్యలను ఉద్దేశించి పరోక్షంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శించడం మానవాళిని ఇబ్బందుల్లోకి నెట్టే ఉరుద్దేశంతో కూడుకున్నవని అన్నారు. సనాతన ధర్మాన్ని సూర్యుడి శక్తితో అభివర్ణించారు. సనాతనాన్ని విమర్శించడం సూర్యుడిపై ఉమ్మేయడమే అని, అది తిరిగి వారి ముఖంపై పడుతుందని యోగి చెప్పారు. ఇలాంటి వారి చేష్టల వల్ల భావి తరాలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని, భారతదేశ సంప్రదాయాల పట్ల గర్వపడాలని అన్నారు. దేవుడిని నాశనం చేయాలని అనుకున్నవాళ్లంతా నాశనమై పోయారని గుర్తు చేశారు. అంతకుముందు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, మలేరియా, డెంగ్యూలతో పోల్చారు.
తాజావార్తలు
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!