Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ సర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి 14 మంది న్యూస్ యాంకర్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీరికి ఈ కూటమి నేతలు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది.
India-Canada: ఇండియా, కెనడాల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు.
CWC meeting: చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాబోతున్నారు.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను వరుసగా ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్గా మార్చడానికి గత ఏడాది జూలైలో షిండే ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్ గా ఉంది, అయితే ప్రస్తుతం దానికి ఛత్రపతిని జోడించి ఛత్రపతి శంభాజీనగర్ గా పేరు మార్చారు.
ఇది ఇండియా కొరకు పనిచేసేత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ. నావిక్ శాటిలైట్ వ్యవస్థని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(IRNSS) అని కూడా పిలుస్తారు.
Baramulla Encounter: గత నాలుగు రోజులుగా జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది. నలుగురు అధికారులు అమరులయ్యారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట సాగిస్తూనే ఉంది. అయితే దట్టమైన అడవులు, గుహలు ఉగ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా శనివారం కాశ్మీర్ లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Nipah Virus: కేరళ రాష్ట్రాన్ని నిపా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆరుగురికి వైరస్ సోకగా.. ఇద్దరు మరణించారు. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని కేసులు కూడా అటవీ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళలో విజృంభిస్తున్నా నిపా వైరస్ ‘బంగ్లాదేశ్ వేరియంట్’ అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
Chandrayaan-1: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 గుర్తించింది. అయితే ఈ నీరు చంద్రుడిపైకి ఎలా చేరిందనేది ప్రశ్నగా మిగిలింది. అయితే చంద్రయాన్-1 డేటా ఆధారంగా పరిశోధనలు చేపట్టారు. ఇందులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నీటికి భూమి కారణమని తెలిసింది. హవాయ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Flight Emergency: అమెరికాలో ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. 10 నిమిషాల్లోనే ఏకంగా 28,000 అడుగుల దిగువకు విమానం చేరింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు గుండె జారిన పనైంది. చివరకు ఎలాగొలా సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ కి చెందిన విమానం బుధవారం అమెరికా నేవార్క్ నుంచి రోమ్కి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
India-Pak Cricket: సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు జరగవని కేంద్రం క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాక్ చరమగీతం పాడకుంటే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించూడదని బీసీసీఐ ముందే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, చొరబాట్లు, దాడులు ఆపితే తప్ప ఇరు దేశాల మధ్య క్రికెట్ సాధ్యపడదని ఆయన రాజస్థాన్ ఉదయ్పూర్ లో చెప్పారు.