Chandrayaan-1: భూమి ఎలక్ట్రాన్స్ కారణంగా చంద్రుడిపై నీరు.. తాజా పరిశోధనలో వెల్లడి
Chandrayaan-1: భూమి సహజ ఉపగ్రహం చంద్రుడిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా చంద్రయాన్-1 గుర్తించింది. అయితే ఈ నీరు చంద్రుడిపైకి ఎలా చేరిందనేది ప్రశ్నగా మిగిలింది. తాజా పరిశోధనల్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై నీటికి భూమి కారణమని తెలిసింది. హవాయ్ యూనివర్సిటీ పరిశోధకుల పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు.
భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంలోని రాళ్లు, ఖనిజాలను విచ్చిన్నం చేయడం లేదా కరిగించడం వంటి చర్యకు కారణమవుతున్నాయని కనుగొన్నారు. చంద్రుడిపై నీటి సాంద్రత, నీటి పంపిణీ దాని నిర్మాణం, పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ అణ్వేషణకు నీటి వనరులను అందించడానికి ఈ పరిశోధనలు కీలకమని పరిశోధకులు చెప్పారు.
Also Read
- Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
- Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
- Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
- Vodafone Idea: వినియోగదారులకు శుభవార్త చెప్పిన వొడాఫోన్ ఐడియా.. రీఛార్జ్ ప్లాన్లపై కీలక ప్రకటన..
Read Also: Salaar OTT: ఇందుకే కదా డైనోసార్ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చేది?
చంద్రుడిపై నీటికి భూమి కారణం:
సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్ లో ఉండే ప్రోటాన్ల వంటి అధిక శక్తి అణువుల చందమామ ఉపరితలాన్ని తాకినప్పుడు అక్కడ నీరు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గతంలో ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే చంద్రుడు భూ అయస్కాంత వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు సోలార్ విండ్ తాకదు. అలాంటి సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.
చంద్రయాన్ 1 మిషన్ లో మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం, ఇమేజింగ్ స్బెక్ట్రోమీటర్ ద్వారా సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను విశ్లేషించారు. ప్లాస్మా షీట్ కలిగిన భూ మాగ్నెటోటైట్ గుండా చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు నీటి నిర్మాణంలో కలిగే మార్పులను వారు ప్రత్యేకంగా అంచానా వేశారు. భూ అయస్కాంత క్షేత్రం గుండా వెళ్తున్నప్పుడు కూడా, చంద్రుడు సోలార్ విండ్ కు ప్రభావితం అయినట్లే అంతే సమానంగా నీటి ఆనవాళ్లు ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్స్ లోని ప్రోటాన్లు ఢీకొట్టినట్టే, చంద్రుడు భూమి అయస్కాంత సంరక్షణలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియే నీరు ఏర్పడటానికి సహాయం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్ల రేడియేషన్ కూడా సోలార్ విండ్ లోని ప్రోటాన్ల వలే పనిచేస్తుందని పరిశోధకలు తేల్చారు.
చంద్రయాన్-1:
చంద్రయాన్-1 ఇస్రో ప్రయోగించిన తొలి మూన్ మిషన్. ఈ మిషన్ ని 2008లో ప్రారంభించింది. దీని ద్వారానే చంద్రుడిపై నీరు ఉందని తెలిసింది. ఈ మిషన్ లో ఓ ఆర్బిటార్, ఇంపాక్టర్ ఉన్నాయి. ఆ తరువాత చంద్రయాన్ 2, ఇటీవల చంద్రయాన్-3ని ఇస్రో నిర్వహించింది. చంద్రయాన్ -3 ద్వారా జాబిల్లిని చేరిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల తరువాత భారత్ నిలిచింది. చంద్రుడి దక్షిణ ధృవంపైకి చేరిన మొదటి దేశంగా భారత్ ఘనత సాధించింది.
తాజావార్తలు
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!