CWC meeting: హైదరాబాద్లో కాంగ్రెస్ మీటింగ్.. 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CWC meeting: చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాబోతున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రముఖ నాయకులు వస్తున్నారు. ఖర్గే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే. కాగా ఈ సమావేశంలో రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా కాబోతున్నాయి.
Also Read
- PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- PM Modi: పార్లమెంట్ ఉభయ సభల్లో యాంటీ-పేపర్ లీక్ బిల్ పాస్.. మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోడీ
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
ఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని అనుకుంటోంది.
ఇలా ఢిల్లీకి వెలుపల హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించడం చూస్తే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి ఎంత కీలకమో తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తన 6 హామీలను ప్రకటించనుంది. ఇదిలా ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కి కీలకంగా మారాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!