India-Pak Cricket: అప్పటి వరకు ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఉండదు.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pak Cricket: సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు జరగవని కేంద్రం క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాక్ చరమగీతం పాడకుంటే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించూడదని బీసీసీఐ ముందే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, చొరబాట్లు, దాడులు ఆపితే తప్ప ఇరు దేశాల మధ్య క్రికెట్ సాధ్యపడదని ఆయన రాజస్థాన్ ఉదయ్పూర్ లో చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరుగుతున్న ఎన్కౌంటర్ లో నలుగురు అధికారులు మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని పెరుగుతున్న డిమాండ్ మధ్య ఆయన ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేశారు. అనంత్నాగ్ లో భారతదేశం నలుగురు ధైర్యవంతుల్ని కోల్పోవడంవ దురద్రుష్టకరమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. మోడీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తీవ్ర చర్యలు తీసుకుంటుందని, దీంతోనే ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయని, ఉగ్రవాదులకు తగిన సమాధానం చెబుతామని అన్నారు.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
26/11 దాడులు(2008 ముంబై అటాక్స్) సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మౌన ప్రేక్షుడిగా మిగిలిపోయిందని ఆయన విమర్శించారు. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపితేనే పాకిస్థాన్తో సంబంధాలు పెట్టుకుంటామని భారత్ స్పష్టం చేసింది. చివరి సారిగా భారత్- పాకిస్తాన్ 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడ్డాయి. ఆ తర్వాత నుంచి ఆసియా కప్, ప్రపంచ కప్ మ్యాచుల్లోనే తలపడుతున్నాయి. చివరి సారిగా భారత క్రికెట్ జట్టు 2006లో పాకిస్తాన్ లో పర్యటించింది. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే భారత్ అక్కడికి వెళ్లేది లేదని తేల్చి చెప్పడంతో ఈ సిరీస్ హైబ్రీడ్ మోడ్ లో జరగుతోంది. శ్రీలంక, పాకిస్తాన్ లో కొన్ని మ్యాచులు జరిగాయి. భారత్ తన అన్ని మ్యాచుల్ని శ్రీలంకలో ఆడింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!