Himanta Biswa Sarma: మొత్తం కాంగ్రెస్ పార్టీని చంద్రుడిపైకి పంపిస్తా.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ సర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి 14 మంది న్యూస్ యాంకర్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీరికి ఈ కూటమి నేతలు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై బీజేపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఈ వివాదంపై సీఎం హిమంత బిశ్వసర్మ మాట్లాడారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ కి వచ్చిన ఆయన మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ 1975 ఎమర్జెన్సీ సమయంలోనే మీడియాపై నిషేధం విధించిందని, ఇది కొత్త కాదని, రిహార్సల్ మాత్రమే అని అన్నారు. ఏదైన కారణం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా సెన్సార్ కి గురవుతుందని కామెంట్స్ చేశారు. సరైన సమయంలో ఇస్రో చంద్రయాన్ తయారు చేసిందని, నేను కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని చంద్రుడిపైకి పంపిస్తానని, అక్కడ అధికారం ఏర్పాటు చేసుకోండి, మీడియాపై నిషేధం విధించుకోండి’’ అంటూ చరకులు అంటించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చైల్డిష్ గా అభివర్ణించారు.
Read Also: India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
Also Read
టీవీ యాంకర్లపై బహిష్కారంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. మేము ఎవరిని నిషేధించలేదు, బహిష్కరించలేదని, ఇది సహాయనిరాకరణ ఉద్యమం, సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎవరికీ మేము సహకరించమని, అలాంటి వారు మా శతృవులని అన్నారు. ఏదీ శాశ్వతం కాదని, రేపు వారు చేస్తున్న పని భారత దేశానికి మంచిది కానది గ్రహిస్తే, మళ్లీ వారి టీవీ షోలకు హాజరవుతామని అన్నారు.
అదితి త్యాగి, అమన్ చోప్రా, అమీష్ దేవ్గన్ ఆనంద్ నరసింహన్, అర్ణబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ్, చిత్ర త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవికా కుమార్, ప్రాచి పరాషర్, రుబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా ఇలా 14 మంది యాంకర్లను బాయ్కాట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది. దీనిని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఎమర్జెన్సీతో పోల్చారు. ఇటువంటి పరిస్థితులను కేవలం ఎమర్జెన్సీ కాలంలో చూశామన్నారు. నిరాశతోనే విపక్ష కూటమి ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విపక్షాల చర్యలను నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది.
#WATCH | Jabalpur, MP: On the INDIA alliance's announcement to boycott several TV news anchors, Assam CM Himanta Biswa Sarma says, "This boycott and media censorship can be traced back to 1975. It is not new. It is a rehearsal for you. For any reason, if the Congress government… pic.twitter.com/kX5ayDkrWa
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 16, 2023
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!