Himanta Biswa Sarma: మొత్తం కాంగ్రెస్ పార్టీని చంద్రుడిపైకి పంపిస్తా.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ సర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి 14 మంది న్యూస్ యాంకర్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వీరికి ఈ కూటమి నేతలు దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై బీజేపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఈ వివాదంపై సీఎం హిమంత బిశ్వసర్మ మాట్లాడారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ కి వచ్చిన ఆయన మాట్లాడుతూ..‘‘కాంగ్రెస్ 1975 ఎమర్జెన్సీ సమయంలోనే మీడియాపై నిషేధం విధించిందని, ఇది కొత్త కాదని, రిహార్సల్ మాత్రమే అని అన్నారు. ఏదైన కారణం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా సెన్సార్ కి గురవుతుందని కామెంట్స్ చేశారు. సరైన సమయంలో ఇస్రో చంద్రయాన్ తయారు చేసిందని, నేను కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని చంద్రుడిపైకి పంపిస్తానని, అక్కడ అధికారం ఏర్పాటు చేసుకోండి, మీడియాపై నిషేధం విధించుకోండి’’ అంటూ చరకులు అంటించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చైల్డిష్ గా అభివర్ణించారు.
Read Also: India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
టీవీ యాంకర్లపై బహిష్కారంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. మేము ఎవరిని నిషేధించలేదు, బహిష్కరించలేదని, ఇది సహాయనిరాకరణ ఉద్యమం, సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఎవరికీ మేము సహకరించమని, అలాంటి వారు మా శతృవులని అన్నారు. ఏదీ శాశ్వతం కాదని, రేపు వారు చేస్తున్న పని భారత దేశానికి మంచిది కానది గ్రహిస్తే, మళ్లీ వారి టీవీ షోలకు హాజరవుతామని అన్నారు.
అదితి త్యాగి, అమన్ చోప్రా, అమీష్ దేవ్గన్ ఆనంద్ నరసింహన్, అర్ణబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ్, చిత్ర త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవికా కుమార్, ప్రాచి పరాషర్, రుబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా ఇలా 14 మంది యాంకర్లను బాయ్కాట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది. దీనిని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఎమర్జెన్సీతో పోల్చారు. ఇటువంటి పరిస్థితులను కేవలం ఎమర్జెన్సీ కాలంలో చూశామన్నారు. నిరాశతోనే విపక్ష కూటమి ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. విపక్షాల చర్యలను నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఖండించింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది.
#WATCH | Jabalpur, MP: On the INDIA alliance's announcement to boycott several TV news anchors, Assam CM Himanta Biswa Sarma says, "This boycott and media censorship can be traced back to 1975. It is not new. It is a rehearsal for you. For any reason, if the Congress government… pic.twitter.com/kX5ayDkrWa
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 16, 2023
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!