India-Canada: ఇరు దేశాల మధ్య ఖలిస్థాన్ చిచ్చు.. వాణిజ్య చర్చలు వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఇండియా, కెనడాల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చింది. అీయితే ఇరు దేశాల మధ్య ఖలిస్తాన్ వేర్పాటువాద అంశమే చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల జీ20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చి వెళ్లిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ సమయంలో భారత ప్రధాని మోడీతో ట్రూడో ద్వైపాక్షి సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా ప్రధాని మోడీ ఖలిస్తాన్, కెనడా కేంద్రంగా భారత వ్యతిరేకతకు పాల్పడుతున్న చర్యలను ముఖ్యంగా ప్రస్తావించారు. భారత రాయబార కార్యాలయాలు, భారత్ దౌత్యవేత్తలపై దాడులు, భారతీయులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని ముందే మోడీ తన బలమైన సందేశాన్ని వ్యక్తపరిచారు.
Also Read
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం అవసరమని మోడీ ప్రస్తావించారు. చర్చల అనంతరం కెనడా పీఎం ట్రూడో మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశం శాంతియుత నిరసనలు తెలిపే స్వేచ్ఛను కాపాడుతుందని, అదే సమయంలో హింసను అడ్డుకుంటుందని అన్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదం గురించి పరోక్షంగా మాట్లాడుతూ కొద్ది మంది చర్యలు కెనడాకు పాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు.
గత కొంత కాలంగా కెనడాలో భారత్ లోని పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేసి ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు సిక్కులు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీని పేరుతో ‘ఖలిస్తాన్ రెఫరెండం’ నిర్వహిస్తున్నారు. సర్రే, వాంకోవర్, టొరంటో వంటి ప్రాంతాల్లో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ..ఏకంగా ప్రధాని మోడీ, మంత్రులు అమిత్ షా, జైశంకర్లను బెదిరించే స్థాయికి చేరారు. చాలా సార్లు భారత ప్రభుత్వం కెనడాను చర్యలు తీసుకోవాలని కోరినా, అక్కడి ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జూన్ నెలలో ఓ కార్యక్రమంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చంపినట్లు ప్రతిబింబించే శకటాన్ని ఏర్పాటు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు లైన్క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం
-
DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!
-
Hantavirus: వెలుగులోకి హంటావైరస్ కేసులు.. భారత్లో వైద్య నిపుణుల కీలక సూచనలు..
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
-
Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!