Mamata Banerjee: మోడీ, అమిత్ షాలు దుర్యోధన, దుశ్శాసనులు..
- అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..
- రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు..
- మోడీ, అమిత్ షా దుర్యోధన, దుశ్శాసనులు..
- విరుచుకుపడిన మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్వర్క్లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పహల్గాం దాడిని కేంద్రమే చేసిందా? అని మమత ప్రశ్నించారు. బెంగాల్లోని బంకురాలోని బిర్సింగ్పూర్లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను మహాభారత ఇతిహాసంలోని ఇద్దరు ప్రతినాయకులైన దుశ్శాసన, దుర్యోధనులుగా అభివర్ణించారు.
Read Also: India-Pakistan war: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.! : యూఎస్ రిపోర్ట్..
Also Read
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
- CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
- Delhi: జంతర్మంతర్ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
- FCRA Bill: FCRA బిల్లు కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?.. ఎన్జీఓ, మిషనరీల్లో భయం, అమెరికాలో వ్యతిరేకత.. అసలేంటి ఈ బిల్లు..
‘‘శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించడానికి బెంగాల్కు వచ్చాడు. ఎన్నికలు రాగానే ఈ దుశ్శాసన, దుర్యోధనులు ప్రత్యక్షమవుతారు’’ అని ఆమె అన్నారు. బెంగాల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్న హోంమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, మమత ఎదురుదాడికి దిగారు, “జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు లేకపోతే, పహల్గాం ఎలా జరిగింది? పహల్గాంలో దాడిని మీరే చేశారా? ఢిల్లీలో జరిగిన సంఘటన వెనుక ఎవరున్నారు?” అని అడిగారు.
బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా ప్రక్రియపై మమత విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. రాజ్బన్షీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ కింద 1.5 కోట్ల మంది పేర్లను తొలగించాలని యోచిస్తున్నారని ఆమె అన్నారు. దీని ద్వారా బెంగాలీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
-
IND Vs ZIM: తిలక్ వర్మ వీరవిహారం.. టీమిండియా భారీ స్కోర్..
-
CJP Protest: 3 డిమాండ్లు కేంద్రం అంగీకరించింది.. ఆందోళన విరమించినట్లుగా సీజేపీ ప్రకటన
-
Delhi: జంతర్మంతర్ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
-
FCRA Bill: FCRA బిల్లు కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?.. ఎన్జీఓ, మిషనరీల్లో భయం, అమెరికాలో వ్యతిరేకత.. అసలేంటి ఈ బిల్లు..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!