Mamata Banerjee: మోడీ, అమిత్ షాలు దుర్యోధన, దుశ్శాసనులు..
- అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో టీఎంసీ వర్సెస్ బీజేపీ..
- రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు..
- మోడీ, అమిత్ షా దుర్యోధన, దుశ్శాసనులు..
- విరుచుకుపడిన మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలో ఉగ్రవాద నెట్వర్క్లు పనిచేస్తున్నాయని అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పహల్గాం దాడిని కేంద్రమే చేసిందా? అని మమత ప్రశ్నించారు. బెంగాల్లోని బంకురాలోని బిర్సింగ్పూర్లో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను మహాభారత ఇతిహాసంలోని ఇద్దరు ప్రతినాయకులైన దుశ్శాసన, దుర్యోధనులుగా అభివర్ణించారు.
Read Also: India-Pakistan war: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.! : యూఎస్ రిపోర్ట్..
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
‘‘శకుని శిష్యుడైన దుశ్శాసనుడు సమాచారం సేకరించడానికి బెంగాల్కు వచ్చాడు. ఎన్నికలు రాగానే ఈ దుశ్శాసన, దుర్యోధనులు ప్రత్యక్షమవుతారు’’ అని ఆమె అన్నారు. బెంగాల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందన్న హోంమంత్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ, మమత ఎదురుదాడికి దిగారు, “జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు లేకపోతే, పహల్గాం ఎలా జరిగింది? పహల్గాంలో దాడిని మీరే చేశారా? ఢిల్లీలో జరిగిన సంఘటన వెనుక ఎవరున్నారు?” అని అడిగారు.
బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా ప్రక్రియపై మమత విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఎస్ఐఆర్ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. రాజ్బన్షీలు, మతువాలు, ఆదివాసీలు వంటి అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ కింద 1.5 కోట్ల మంది పేర్లను తొలగించాలని యోచిస్తున్నారని ఆమె అన్నారు. దీని ద్వారా బెంగాలీల ఓటు హక్కును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!