Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎలక్షన్ డ్యూటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడమే కాకుండా, షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఖంగుతినే సమాధానం వచ్చింది. ఈ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అఖిలేష్ కుమార్ మిశ్రా అనే ఉపాధ్యాయుడికి 35 ఏళ్లు. సాత్నాలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల డ్యూటీ కోసం ఆయనతో పాటు మిగతా ఉపాధ్యాయులకు కూడా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 16,17 తేదీల్లో శిక్షణా తరగతులకు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి అఖిలేష్ కుమార్ హాజరు కాలేదు. దీనిపై ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Chhattisgarh: ఎన్నికలకు 3 రోజుల ముందు.. బీజేపీ లీడర్ని హతమార్చిన మావోయిస్టులు..
అయితే, దీనికి సమాధానంగా అఖిలేష్ కుమార్.. ‘‘ ఇప్పటికే నాకు 35 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంకా పెళ్లి కాలేదు. బ్యాచిలర్గా ఉండలేకపోతున్నా. జీవితాంతం భార్య లేకుండా ఉండిపోవాల్సి వస్తుందేమో అని భయమేస్తుంది. ముందు నాకు పెళ్లి చేయండి. ఆ తర్వాత ఎన్నికల విధులకు వస్తాను’’ అని అక్టోబర్ 31న రిఫ్లై ఇచ్చారు. అసలే పెళ్లి కావడం లేదని చెబుతూనే.. తనకు రూ. 3 లక్షల కట్నంతో పాటు తాను ఉంటున్న ప్రాంతంలో ఓ ప్లాట్ ఇవ్వాలని కోరడం కొసమెరుపు.
ఈ సమాధానంపై కలెక్టర్ అతడిని నవంబర్ 2న సస్పెండ్ చేశారు. అయితే మొబైల్ ఫోన్ ఉపయోగించకపోవడం వల్ల అతను సస్పెండ్ అయిన విషయం తెలియలేదు. తోటి ఉద్యోగి చెప్పడంతో తాను సస్పెండ్ అయినట్లు అఖిలేష్ కుమార్ విషయాన్ని తెలుసుకున్నారు. పెళ్లికాకపోవడంతో ఒత్తిడిలో ఉన్నాడని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కలెక్టర్ స్థాయి అధికారి ఎవరైనా వివరణ కోరితే ఇలాంటి సమాధానం చెబుతారా..? గతేడాదిగా అతను మొబైల్ ఫోన్ వాడటం లేదని సదరు ఉద్యోగి చెప్పారు.
తాజావార్తలు
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!