Baba Vanga: ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Vanga: బాబా వంగా ప్రత్యేకంగా పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడో మరణించినా ఆమె చెప్పినవన్నీ చెప్పినట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయనే విషయాలను ఊహించి జోస్యం చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటి వరకు ఈ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త చెప్పినవి కొన్ని నిజాలయ్యాయి.
ఆమె 1996లో మరణించినప్పటికీ ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరగడంతో ఆమె జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని కూడా పిలువబడే బాబా వంగా గతంలో అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్స్ డయానా మరణం, చెర్నోబిల్ అణు విపత్తు, బ్రెగ్జిట్ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారు.
Also Read
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్లు మృతి
- Petrol Diesel Price Hike: వామ్మో.. ఒకేసారి రూ.13 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన!
- Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
Read Also: Naga Chaitanya: బీస్ట్ మోడ్ లోకి మారిపోయాడు… వర్కౌట్స్ చూస్తే మతి పోవాల్సిందే
అయితే, 2024లో జరిగే ఏడు సంఘటనలను ఆమె ఊహించింది. ప్రస్తుతం ఇవి ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వీటని డైలీ స్టార్ నివేదించింది.
* వచ్చే ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై తోటి దేశస్తుడు హత్యయత్నానికి పాల్పడుతాడు.
* యూరప్లో ఉగ్రవాద దాడుల గురించి హెచ్చరించారు. దీంతో పాటు వచ్చే ఏడాది ఓ పెద్ద దేశం జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడుల్ని నిర్వహిస్తుంది.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. రుణ స్థాయిలు పెరగడం మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం.
* 2024లో భయానక ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.
* సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని ఆధ్యాత్మికవేత్త పేర్కొన్నారు. అధునాతన హ్యాకర్లు పవర్ గ్రిడ్లు మరియు నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
* అల్జీమర్స్, క్యాన్సర్ వంటి నయంచేయలేని రోగాలకు కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయి.
*క్వాంటం కంప్యూటింగ్ లో కీలక పరోగతి ఉంటుందని అంచనా వేశారు.
1911లో వాంపజేలియ పాండేవా డిమిత్రోవా జన్మించారు. ఆ తరువాత ఆమె పేరు బాబా వంగాగా మారింది. 12 ఏళ్ల వయసులో ఓ భారీ తుఫానులో ఆమె తన కళ్లను కోల్పోయింది.
తాజావార్తలు
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
-
Vaibhav Sooryavanshi: 3 మ్యాచ్లు.. కేవలం 42 పరుగులు.. వైభవ్ సూర్యవంశీకి నేడే ‘అగ్ని పరీక్ష’!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!