PM Modi: “రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నారు”.. పాకిస్తాన్పై ప్రధాని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు భారత్ మానసిక అవరోధాలకు గురవుతూ వచ్చింని, దీని వల్ల దేశం సాధించాల్సి అభివృద్ధి సాధించలేకపోయిందని అన్నారు. ఇప్పుడు భారత్ ప్రతీ అవరోధాన్ని బద్ధలుకొట్టి చంద్రుడిపై ఎవరూ చేరుకుని భాగంలోకి అడుగుపెట్టిందని, మొబైల్ తయారీలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉందని, స్టార్టప్స్లో భారత్ మూడో స్థానంలో ఉందని ప్రధాని చెప్పారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
Read Also: Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..
పేదరికాన్ని కేవలం నినాదాలతో ఓడించలేమని, పరిష్కారాల ద్వారా పోరాడవచ్చని ప్రధాని సూచించారు. భారత్ చాలా కాలంగా అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, దాడులు, వలసవాదం మనల్ని అడ్డంకులు కట్టడి చేశాయని, స్వాతంత్ర్యోద్యమం అనేక అడ్డంకులను బద్దలు కొట్టింది. కానీ ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేదని, తన సామర్థ్యం మేరకు భారత్ ఎదగలేదని అన్నారు.
జన్ధన్ ఖాతా పథకంపై చాలా అనుమానాలు ఉండేవని, బ్యాంకులు కేవలం ధనికులకే భావించే పేద ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని ఈ పథకం నింపిందని చెప్పారు. ఏసీ గదుల్లో నివసించే వారు పేద ప్రజల మానసిక సాధికారతను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దీని వల్ల కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, పర్యాటకం పెరిగిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Irummudi: ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలను వెనక్కి నెట్టిన రవితేజ ‘ఇరుముడి’!
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!