PM Modi: “రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నారు”.. పాకిస్తాన్పై ప్రధాని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ 2023లో శనివారం ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వాటిని రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్ని విమర్శించారు. గతంలో ఉగ్రవాద దాడుల తర్వాత భారత్ సాయం కోసం ప్రపంచానికి విజ్ఞప్తి చేసేదని, ఇప్పుడు దాడుల వెన ఉన్న దేశాలు తమను రక్షించాలని కోరుతున్నాయని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు భారత్ మానసిక అవరోధాలకు గురవుతూ వచ్చింని, దీని వల్ల దేశం సాధించాల్సి అభివృద్ధి సాధించలేకపోయిందని అన్నారు. ఇప్పుడు భారత్ ప్రతీ అవరోధాన్ని బద్ధలుకొట్టి చంద్రుడిపై ఎవరూ చేరుకుని భాగంలోకి అడుగుపెట్టిందని, మొబైల్ తయారీలో భారత్ ఇప్పుడు అగ్రగామిగా ఉందని, స్టార్టప్స్లో భారత్ మూడో స్థానంలో ఉందని ప్రధాని చెప్పారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Madhya Pradesh: నాకు పెళ్లి చేస్తేనే, ఎలక్షన్ డ్యూటీకి వస్తా..
పేదరికాన్ని కేవలం నినాదాలతో ఓడించలేమని, పరిష్కారాల ద్వారా పోరాడవచ్చని ప్రధాని సూచించారు. భారత్ చాలా కాలంగా అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, దాడులు, వలసవాదం మనల్ని అడ్డంకులు కట్టడి చేశాయని, స్వాతంత్ర్యోద్యమం అనేక అడ్డంకులను బద్దలు కొట్టింది. కానీ ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేదని, తన సామర్థ్యం మేరకు భారత్ ఎదగలేదని అన్నారు.
జన్ధన్ ఖాతా పథకంపై చాలా అనుమానాలు ఉండేవని, బ్యాంకులు కేవలం ధనికులకే భావించే పేద ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని ఈ పథకం నింపిందని చెప్పారు. ఏసీ గదుల్లో నివసించే వారు పేద ప్రజల మానసిక సాధికారతను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. దీని వల్ల కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, పర్యాటకం పెరిగిందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!